ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు పెళ్లై పిల్లలు ఉన్నా కూడా పరాయి మహిళపై మనసు పడుతున్నారు. ఆమెతో సీక్రెట్ గా ఎంజాయ్ చేస్తూ చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ, ఓ వ్యక్తి ఏకంగా తన ప్రియురాలి కూతురుపైనే కన్నేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
అతని పేరు రాములు. మెదక్ జిల్లాలోని నందిగామలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్నిపోషిస్తున్నాడు. అయితే, రాములు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఇద్దరూ సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. కానీ, అంతటితో ఆగని రామలు.. తన ప్రియురాలి కుమార్తెపైనే కన్నేశాడు. గత కొన్ని రోజులు నుంచి ఆ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అతని ప్రియురాలు ఏం చేసిందో తెలుసా?
పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లాలోని నందిగామ గ్రామం. ఇక్కడే రాములు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా పని చేస్తూ ఉండేవాడు. ఇకపోతే, రాములు అదే గ్రామానికి చెందిన వివాహిత అయిన వీరమణితో వివాహేతర సంబంధం నడిపించాడు. ఇద్దరూ సీక్రెట్ గా ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ వచ్చారు. కాగా, రాములు అప్పుడప్పుడు ప్రియురాలి ఇంటికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే వీరమణి కూతురుని చూశాడు. దీంతో ఆ వ్యక్తి ఆ అమ్మాయిపై కన్నేశాడు. చూడడానికి అందంగా ఉండడంతో ఎలాగైన కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు రాములు. ఇక అప్పటి నుంచి ఆ యువతిని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు.
ఇదే విషయం కొన్ని రోజుల తర్వాత వీరమణికి తెలిసింది. బుద్ది మార్చుకోవాలంటూ ఆ వివాహిత ప్రియుడికి ఎన్నో సార్లు చెప్పి చూసింది. అతడి ప్రవర్తనలో మార్పు మాత్రం రాలేదు. ఇలా అయితే కాదని భావించిన వీరమణి.. ఎలాగైన రాములును ప్రాణాలతో లేకుండా చేయాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే వీరమణి తన బంధువుల్లోని.. మ్యాదరి నర్సింలు, వీర్ సింగ్, పట్నం మహేష్, మ్యాదరి స్వప్నలకు జరిగిందంతా వివరించింది. దీనికి వీళ్లు కూడా సరేన్నారు. వీరమణి వీళ్లతో పాటు స్నేహితులైన మహమ్మద్ ఆరీఫ్, మెదక్ పట్టణం ఫతే నగర్ కు చెందిన అనిరుధ్ సాయం కూడా తీసుకుంది. వీళ్లందరికీ తన ప్లాన్ వివరించి రాములు హత్యకు టైమ్ ఫిక్స్ చేసింది.
ఈ నెల 17న రాములును నమ్మించి మెదక్ లోని అనిరుధ్ ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడితో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. ఇక అనంతరం ఇనుప రాడ్డుతో రాములు తలపై బలంగా బాదడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత అతడి శవాన్ని సంచిలో చుట్టి ఏడుపాయల చెక్ డ్యాం సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చింది.
ఏం జరిగిందని స్థానికులు గమనించగా.. గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని రాములుగా గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా ఎట్టకేలకు నిందితులైన.. వీరమణి, మ్యాదరి నర్సింలు, వీర్ సింగ్, పట్నం మహేష్, మ్యాదరి స్వప్నల, మహమ్మద్ ఆరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.