ఆమెకు గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఓ కూతురు, కుమారుడు జన్మించాడు. అయితే ఉన్నట్టుండి ఆమె చేసిన పనికి అంతా షాక్ గురవుతున్నారు.
ఈమె పేరు స్వాతి, వయసు 30 ఏళ్లు. చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. కొంత కాలానికి ఈ వివాహితకు ఓ కూతురు, కుమారుడు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ మహిళ సంతోషంగానే కాపురాన్ని కొనసాగించింది. ఆమె సంసారం బాగానే చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, ఉన్నట్టుండి స్వాతి చేసిన పనికి అందరూ షాక్ గురవుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా తూఫ్రాన్ కాళ్లకల్ ప్రాంతం. ఇక్కడే చెనిగారపు స్వాతి (30) అనే వివాహిత నివాసం ఉంటుంది. పెళ్లైన కొంత కాలానికి ఈమెకు ఓ కుమారుడు, కూతురు జన్మించారు. అయితే, స్వాతి గత కొంత కాలం నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు సమాచారం. ఇదే విషయంపై చాలా కాలం నుంచి బాధ పడుతూ వస్తున్నట్లు సమాచారం. ఇక రాను రాను ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువవుతుండడంతో స్వాతి తట్టుకోలేకపోయింది.
దీంతో ఆమెకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక స్వాతి గురువారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ స్వాతి శుక్రవారం మృతి చెందింది. స్వాతి మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.