manja: మాంజా కారణంగా ఓ వ్యక్తి మూడు లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు. అంతేకాదు! గాయాలతో ఆసుపత్రి పాలై నరకం అనుభవిస్తున్నాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. న్యూఢిల్లీకి చెందిన 55 ఏళ్ల మదన్ సింగ్ ఓ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. బుధవారం రూ.6 లక్షల రూపాయల క్యాష్తో బైకుపై వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో గాలిపటం మాంజా అతడి గొంతుకు చుట్టుకుంది. దీంతో అతడు బైకుపై నుంచి కిందపడ్డాడు. గొంతుకు, భుజానికి దెబ్బలు తగిలాయి.
చట్టుపక్కలి వాళ్లు అతడ్ని ఆసుపత్రిలో చేర్చారు. గాయాలనుంచి కోలుకున్న తర్వాత మదన్ తన బ్యాగులో డబ్బును చూసుకున్నాడు. రూ. 3 లక్షల రూపాయలు కనిపించలేదు. శుక్రవారం అతడు పోలీసులను ఆశ్రయించాడు. జరిగిందంతా చెప్పి, రూ. 3 లక్షలు దొంగిలించారని ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన జరిగినపుడు అతడు చుట్టూమూగిన జనంలోని వాళ్లే ఈ దొంగతనం చేసుంటారని భావిస్తున్నారు. వారి వివరాలను సేకరించటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : టీచర్పై వ్యామోహం.. బాత్ రూమ్లో ఉండగా వీడియోలు తీసిన విద్యార్థి!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.