మహబూబ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ బాలికను కనిరం లేకుండా వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఇంతటితో ఆగకుండా ఆ బాలికను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన ఆ బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.అది మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగరి. ఇదే ప్రాంతంలో 9 తరగతి చదివే ఓ బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది.
అయితే గత కొంత కాలం నుంచి వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి ఇదే బాలికపై కన్నేసి ఉంచాడు. ఎలాగైన అన్న కూతురిపై కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. దీని కోసం గతంలో అనేక ప్రయత్నాలు చేశాడు. అలా సమయం కోసం వేచి చూసిన ఆ దుర్మార్గుడు తాజాగా దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా ఆ బాలిక ఒంటరిగా ఉండడం చూశాడు. ఇదే మంచి సమయం అనుకున్న ఆ కామాంధుడు తన స్నేహితుడి సాయంతో ఆ బాలికను బలవంతంగా ఓ చోటకు తీసుకెళ్లారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు ఆ బాలికను అత్యాచారం చేశారు. ఇక ఇదే విషయాన్ని ఆ బాలిక అందరికి చెబుతుందేమోనని భయంతో ఆ దుర్మార్గులు ఆ బాలికను దారుణంగా హత్య చేశారు. అనంతరం ఓ చెట్టుకు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
ఇక సాయంత్రం అయినా కూతురు ఇంటికి రాకపోడంతో తల్లిదండ్రులు అటు ఇటు అంతటా వెతికారు. ఎంత వెతికినా కూతురు జాడ మాత్రం దొరకలేదు. అలా వెతుకుతున్న క్రమంలోనే వారి కూతురు చెట్టుకు వేలాడుతూ కనిపించిందని గ్రామస్తులు చర్చించుకున్నారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి చూడగా కూతురు చెట్టుకు వేలాడుతూ కనిపించింది. కూతురును అలా చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.