ఒక్కగానొక్క బిడ్డ.. కావడంతో తల్లిదండ్రులు అపురూపంగా చూసుకున్నారు. తమకున్నంతలోనే బిడ్డకు ఏలోటు లేకుండా అన్ని అమర్చి ఎంతో ప్రేమగా పెంచారు. అయితే దురదృష్టవశాత్తు యువతి చిన్నతంలోనే తండ్రి మరణించాడు. కళ్ల ముందున్న బిడ్డ భవిషత్తు గురించి ఆలోచించిన ఆ తల్లి.. బాధను దిగమింగి.. రెక్కలు ముక్కలు చేసుకుని.. బిడ్డ కోసం కష్టపడి పని చేసి.. ఆమెను పెంచి పెద్ద చేసింది. తండ్రి లేడు.. తల్లి కష్టాన్ని చూసి ఎంతో బాధ్యతగా మెలగాల్సిన యువతి.. అనాలోచితంగా ప్రవర్తించింది. ఓ వ్యక్తిని ప్రేమించింది.. కారణాలు తెలియదు కానీ.. మరో యువకుడితో పెళ్లికి రెడీ అయ్యింది. దాంతో ప్రేమించిన వ్యక్తి బెదిరింపులకు గురి చేయడంతో.. దారుణ నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోయినా.. బిడ్డే లోకంగా బతుకుతున్న తల్లి.. యువతి చేసిన పనికి గుండెలు పగిలేలా రోదిస్తోంది. ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ విషాద సంఘటన.. మహబూబ్నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఉంద్యాల గ్రామ తండాకు చెందిన ముడావత్ అంజమ్మ, హనుమంతు దంపతులకు పుష్పలత అనే కుమార్తె ఉంది. ఒక్కతే సంతానం కావడంతో.. తమకున్నంతలో బిడ్డను బాగా చూసుకున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం పుష్పలత తండ్రి హనుమంతు మృతి చెందాడు. తల్లి.. అంజమ్మే టైలరింగ్ చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో పుష్పలతకు.. అదే తండాకు చెందిన సాయి సందీప్ నాయక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.
అయితే తల్లికి పుష్పలత ప్రేమ విషయం తెలియక.. వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించింది. వచ్చే నెల పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం కాస్త సందీప్కు తెలిసింది. దాంతో పుష్పలతను వేధించసాగాడు. నన్ను ప్రేమించి.. మరో వ్యక్తిని ఎలా వివాహం చేసుకుంటావ్.. అని గొడవపడసాగాడు. అంతేకాక తనను వివాహం చేసుకోకపోతే.. తామిద్దరం దిగిన ఫోటోలు, వీడియోలను బయటపెట్టి పెళ్లి చెడగొడతానని.. బెదిరించసాగాడు. దీనికి తోడు.. సందీప్ స్నేహితుడు.. బాషా నాయక్ అనే వ్యక్తి సైతం.. తన మిత్రుడిని పెళ్లి చేసుకోవాలని పుష్పలతను వేధించసాగాడు.
వీరిద్దరి వేధింపులు భరించలేకపోయిన.. పుష్పలత.. గురువారం సాయంత్రం.. తల్లి ఇంట్లో లేని సమయం చూసి.. ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. పొలం పనులకు వెళ్లి.. ఇంటికి వచ్చిన అంజమ్మకు.. గదిలో ఫ్యాన్కు వేలాడుతున్న పుష్పలత కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారిని పిలవగా.. వారు వచ్చి పుష్పలతను కిందకు దించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. శుక్రవారం దీని గురించి పోలీసులకు తెలిసింది. దాంతో గ్రామానికి వచ్చి.. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. బిడ్డే లోకంగా బతుకుతున్న తల్లికి ఇంత బాధ మిగిల్చిన పుష్పలత నిర్ణయం సరైందేనని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.