వివాహేతర సంబంధం మోజులో పడి కొందరు మహిళలు ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. భర్తను కాదని ప్రియుడితో ఉండేందుకు ఎవరు అడ్డొచ్చినా వారిని అడ్దు తొలగించుకునేందుకు చూస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కసాయి తల్లి వివాహేతర సంబంధానికి కూతురు అడ్డుగా ఉందని గొంతు నులిమి హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. అది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉమ్మడి పెనుగొండ. నర్సింహులగూడెంకు చెందిన పూనెం శిరీషకు అశోక్ అనే వ్యక్తితో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల అనూశ్రీ అనే కూతురు కూడా ఉంది.
కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ రోజులు గడిచే కొద్ది భార్య తన బుద్దిని వక్రమార్గంలోకి మళ్లించి సొంత అన్నతోనే వివాహేతర సంబంధాన్ని నడిపించింది. ఈ విషయం తెలుసుకున్న భర్త అశోక్ భార్యను వదిలేసి వెళ్లిపోయాడు. ఇదే అదునుగా భావించిన శిరీష అక్కడి నుంచి అన్నతో పాటు భువనగిరికి మకాం మర్చింది. ఇక్కడే ఓ ఫౌల్ట్రీ ఫాంలో పని చేసుకుంటూ ఏకంగా అన్నతోనే సహజీవనం చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే కూతురు అనూశ్రీ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, చూపించే స్థోమత కూడా లేకపోవడంతో శిరీష కాస్త ఆలోచనలో పడింది. పైగా తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించి అనూశ్రీని లేకుండా చేయాలని ఫిక్స్ అయింది.
ఇందులో భాగంగానే గత నెల 24న శిరీష తన ప్రియుడితో కలిసి కూతురు అనూశ్రీ గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది. అనంతరం అనూశ్రీ కడుపు నొప్పితో మరణించిందంటూ చిత్రీకరించి బాలిక మృతదేహనికి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేశారు. ఎందుకో శిరీష ప్రవర్తనపై అనుమానమొచ్చిన కొందరు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలోని చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోస్ట్ మార్టం నివేదికను పరిశీలించిన పోలీసులు బాలిక మరణాన్ని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని శిరీషను విచారించారు. ఇక పోలీసులు విచారణలో భాగంగా శరీష నేనే హత్య చేశానంటూ ఒప్పుకుంది. అనంతరం శిరీషతో పాటు ఆమె ప్రియుడుని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తన పడక సుఖం కోసం కన్న కూతురినే హత్య చేసిన ఈ దుర్మార్గురాలి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.