కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం ఆకులవారి మెరక. ఇదే ప్రాంతాని చెందిన జ్యోతి అనే యువతికి దైవాలపాలెంకు చెందిన మేడిశెట్టి సురేష్ తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారి ప్రేమించుకున్నారు. ఇక కొంత కాలం తర్వాత వీరు పెళ్లి చేసుకోవాలని యువతి ఇంట్లో చెప్పారు. కానీ వీళ్లు ఒప్పుకోకపోవడంతో వారిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అందరూ కలిసిపోయి సంతోషంగా జీవిస్తున్నారు. అప్పటి నుంచి జ్యోతి, సురేష్ సంతోషంగానే జీవిస్తున్నారు. అయితే ఆకులవారి మెరక ప్రాంతంలో గ్రామ దేవత తీర్థమహోత్సవం జరగ్గా అల్లుడు సురేష్ జ్యోతిని ఇటీవల పుట్టింటికి తీసుకువచ్చి వదిలి వెళ్లాడు.
ఈ నెల 2వ తేదీ శనివారం రాత్రి జ్యోతితో పాటు ఆమె తల్లి, తండ్రి తిని పడుకున్నారు. అదే రోజు రాత్రి ఉన్నట్టుండి అనూహ్యంగా వారి ఇంటికి మంటలు అంటుకున్నాయి. నిద్రమత్తులో ఉన్న ఈ ముగ్గురు మంటల వేడిని గుర్తించలేకపోయారు. నిమిషం, నిమిషానికి మంటలు ఇళ్లంతా వ్యాపించాయి. ఇల్లు మొత్తం అంటుకుందని గమనించిన జ్యోతి తండ్రి వెంటనే ఇంట్లో నుంచి బయటపడ్డాడు. కానీ నిద్రిస్తున్న తన భార్య, కూతురు మాత్రం బయటకు రాలేకపోయారు. ఇళ్లంత మంటలు అంటుకోవడంతో ప్రమాదవశాత్తు తల్లీకూతుళ్లు సజీవదహనమయ్యారు. అయితే ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొదటగా భర్తపైనే అనుమానం ఉండడంతో అతని పనే అనుకున్నారు.
ఇది కూడా చదవండి: East Godavari: అయిదు నెలల క్రితమే ప్రేమ పెళ్లి.. అనూహ్యంగా ఇంటికి అంటుకున్న మంటలు!
కానీ విచారణలో మాత్రం సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే సురేష్ అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోవంతో ప్రియురాలు నాగలక్ష్మీని పూర్తిగా పట్టించుకోవడమే మానేశాడు. దీంతో ప్రియుడి మాయలో పడ్డ ఆ మహిళ ఎలాగైన ప్రియుడి భార్య జ్యోతిని హత్య చేయాలనే ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే ఇటీవల జ్యోతి వారి పుట్టింటికి వెళ్లింది తెలుసుకుంది. అక్కడికెళ్లిన నాగలక్ష్మి.. తన సవతి కూతుళ్లయిన సౌజన్య, దివ్య, హరితలను తీసుకెళ్లి.. జ్యోతి, ఆమె తల్లి నిద్రిస్తుండగా వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మంటలు అంటుకుని తల్లీకూతుళ్లు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు నాగలక్ష్మి, సౌజన్య, దివ్య, హరితలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.