ప్రేమ వివాహం ఓ ఇంట్లో చిచ్చురేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి అమ్మాయి తరుఫు బంధువుల యువకుడి కుటుంబాన్ని కిడ్నాప్ చేసి ఆపై దాడికి పాల్పడ్డాడు. ఇక ఇంతటితో ఆగక.. మీ కుమారుడు ఎక్కడున్నాడో సమాచారం ఇవ్వకుంటే కేసులు పెడతామని బ్లాక్ మెయిల్ కు దిగారు. వీటిని భరించలేని ఆ కుటుంబంలోని ముగ్గురు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటకలోని హావేరి పరిధిలోని అగడి గ్రామం. ఇక్కడే విరుపాక్షప్ప, లలితా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కిరణ్, అరుణ్ అనే కుమారులు ఉన్నారు. అయితే ఇటీవల పెద్ద కుమారుడు కిరణ్ కి సౌజన్య అనే అమ్మాయితో తల్లిదండ్రులు పెళ్లి జరిపించారు. దీంతో దంపతులు ఇద్దరు సంతోషంగా జీవిస్తున్నారు. ఇదిలా ఉంటే కిరణ్ తమ్ముడు అరుణ్ అదే గ్రామంలోని ఓ యువతిని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇక ఈ మధ్యే అన్న కిరణ్ పెళ్లి కూడా కావడంతో లైన్ క్లియర్ అయిందని అరుణ్ అనుకున్నాడు. కాగా, ఈ నెల 19న అరుణ్ తన ప్రియురాలిని తీసుకుని ఎక్కడికి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
వెంటనే అమ్మాయి తరుపు బంధువులు, కుటుంబ సభ్యులు.. యువకుడి అన్న కిరణ్, తల్లి లలితా, కోడలిని సైతం కిడ్నాప్ చేశారు. అరుణ్ ఎక్కడున్నాడో చెప్పాలని, లేకుంటే మీపై పోలీస్ కేసు పెడతామంటూ బ్లాక్ మెయిల్ చేసి రెండు రోజుల తర్వాత ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. ఇక సంఘంలో మా పరువు పోయిందంటూ ఆ కుటుంబ సభ్యులు తీవ్ర మనస్థాపానికి లోనయ్యరు. ఈ క్రమంలోనే ముగ్గురు ఇటీవల ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కిరణ్ తండ్రి కన్నీటి సంద్రంలో మునిగిపోయాడు. అనంతరం యువతి కుటుంబ సభ్యులపై అరుణ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.