భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో దేశ ప్రజలంతా వజ్రోత్సవాల పేరుతో జెండా పండగ జరుపుకుంటున్నారు. అయితే సోమవారం కరీంనగర్ లో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తున్న భార్యపై ఓ భర్త అందరూ చూస్తుండగానే దారుణానికి పాల్పడ్డాడు. కత్తితో భార్య పీక కోసి కిరాతకానికి ఒడిగట్టాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి గ్రామం.
శిరీష, ప్రవీణ్ భార్యాభర్తలు. శిరీష అంగన్ వాడి కేంద్రంలో ఆయాగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. అయితే ఈ దంపతుల మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శిరీష సోమవారం స్వాతంత్ర్య దినోత్సవాలకు హాజరైంది. అయితే ఈ నేపథ్యంలోనే భర్త భార్యపై కోపంతో రగిలిపోయాడు. వేడుకల్లో పాల్గొని భార్య తిరిగి వస్తుండగా పదునైన ఆయుధంతో భర్త శిరీష పీక కోశాడు. అందరూ చూస్తుండగానే భర్త ఈ దారుణానికి పాల్పడంతో కొద్దిసేపే ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ కు గురయ్యారు.
ఈ దాడిలో శిరీష రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల గొడవల కారణంగానే భర్త ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని గ్రామస్థులు అభిప్రాయడపడ్డారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.