భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో దేశ ప్రజలంతా వజ్రోత్సవాల పేరుతో జెండా పండగ జరుపుకుంటున్నారు. అయితే సోమవారం కరీంనగర్ లో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తున్న భార్యపై ఓ భర్త అందరూ చూస్తుండగానే దారుణానికి పాల్పడ్డాడు. కత్తితో భార్య పీక కోసి కిరాతకానికి ఒడిగట్టాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి గ్రామం. […]