కొంతమంది వ్యక్తులు ప్రతీ సమస్యకు ఆత్మహత్యను శాశ్వత పరిష్కారంగా భావిస్తున్నారు. కుటుంబం గురించి, తమను నమ్ముకున్న వారి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఓ వ్యక్తి తన చావుకు భార్యే ప్రధాన కారణమంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఓ సూసైడ్ నోట్ వాఖ్యాలను ఓ గోడపై రాశాడు. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కామారెడ్డి జిల్లా బిచ్కుంద గ్రామానికి చెందిన 36 ఏళ్ల నక్కమూతి హన్మాండ్లు, జ్యోతి భార్యాభర్తలు. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం ఇంట్లోని సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హన్మాండ్లు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హన్మాండ్లు ఇంటి దగ్గర పరిశీలించిన పోలీసులకు అక్కడి గోడపై సూసైడ్ నోట్ కనిపించింది. దానిపై ఈ విధంగా రాసి ఉంది.
‘‘ నా చావుకు కారణం.. నా భార్య జ్యోతి, నా అత్త, నా మామ, నా బావమరిది మరియు జుక్కల్ కార్మెల్ స్కూల్ టీచర్ శ్రావణ్ గాడు.. దయచేసి నా అమ్మకు న్యాయం చేయండి. ఇట్లు. హన్మాండ్లు’’ అని రాసి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హన్మాండ్లుది హత్యా?.. ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక, ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హన్మాండ్లు మరణంపై కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు కూడా కంటతడి పెట్టుకున్నారు. మరి, భార్య తరపు వారి కారణంగానే తాను చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డ హన్మాండ్లు విషాద కథపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.