తాటి రాజు, జ్యోతి దంపతులు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా జీవించారు. కట్ చేస్తే.. ఆరు నెలల క్రితమే అతని భార్య మరణించింది. ఇక భార్య మృతిని తట్టుకోలేని భర్త సైతం ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్యాభర్తల బంధం అనేది ఎంతో పవిత్రమైనది. రాత్రి ఎంత తిట్టుకున్నా, కొట్టుకున్నా.. తెల్లారేసరికి మళ్లీ ఇద్దరు ఒక్కటవ్వుతుంటారు. ప్రేమ అప్యాయలతో సంసార జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. అయితే భార్యాభర్తలకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా.. అస్సలు తట్టుకోలేరు. ఒకవేళ ఇద్దరిలో ఎవరైన చనిపోతే.. ఆ బాధను దిగమింగుకోలేరు. మరికొందరైతే.. నా తోడు లేని జీవితం నాకొద్దని ఆత్మహత్య చేసుకున్నవాళ్లు సైతం అనేకం. సరిగ్గా ఇలాగే జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేని భర్త ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికులు కంటతడి పెడుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తెలంగాణ జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ ప్రాంతం. ఇక్కడే రైల్వే కాలనీలో తాటి రాజు (40), జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే అనారోగ్య కారణాలతో జ్యోతి గత ఆరు నెలల కిందట మరణించింది. దీంతో భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త రాజు.. తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మొత్తానికి కుటుంబ సభ్యులు అతనికి నచ్చజెప్పి రెండు నెలల కిందట మరో మహిళతో రెండో వివాహం జరిపించారు. కానీ, రెండో వివాహం చేసుకున్నా రాజుకు.. తన మొదటి భార్య జ్యోతి తరుచు గుర్తుకు వస్తుందని తన కుటుంబ సభ్యులకు చెప్పి ఆవేదనకు గురయ్యేవాడు.
అయితే ఈ క్రమంలోనే రాజు సోమవారం ఘన్ పూర్ శ్మశానవాటికకు చేరుకుని భార్య సమాధి పక్కనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో రాజు అప్పటికే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో అతని రెండో భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. మొదటి భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.