వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలను ఎదురించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కట్ చేస్తే.. పెళ్లైన 10 రోజులకే అమ్మాయి ఒక్కసారిగా మాట మార్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఇతడి పేరు వర ప్రసాద్. స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా ఇతడిని ఇష్టపడింది. దీంతో ఇద్దరు కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇక చివరికి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ, కులాలు వేరు కావడంతో పెద్దలు నిరాకరిస్తారని ప్రేమ వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. అనంతరం అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరికి పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆ ప్రేమికులు సరే అన్నారు. ఇక పెళ్లైన 10 రోజులకే యువతి మాట మార్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
జనగాం జిల్లా బీబీపెటకు చెందిన వరప్రసాద్ (24) అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా ఇతడిని ఇష్టపడింది. దీంతో ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అలా వీరి ప్రేమాయణ కొన్నాళ్ల పాటు నడిచింది. ఇక ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఇద్దరివి కులాలు వేరుకావడంతో పెద్దలు ఒప్పుకోరని అనుకున్నారు. ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇందులో భాగంగానే ఇటీవల ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఈ ప్రేమికులు స్థానిక పోలీసులకు ఆశ్రయించి రక్షణ కల్పించాలని కోరారు.
పోలీసులు ఇద్దరి తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి కౌన్స్ లింగ్ ఇచ్చారు. యువతి తల్లిదండ్రులు సైతం..10 రోజుల తర్వాత ఇద్దరికి పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. కట్ చేస్తే.. 10 రోజుల తర్వాత యువతి వర ప్రసాద్ కు ఫోన్ చేసి.. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది అని చెప్పడంతో వర ప్రసాద్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక్కసారిగా మాట మార్చడంతో ఆ యువకుడు తట్టుకోలేక మార్చి 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
వెంటనే గమనించిన అతని కుటుంబ సభ్యులు వర ప్రసాద్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ యువకుడు చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచాడు. అతడు మరణించడంతో వర ప్రసాద్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మా కుమారుడి చావుకి స్థానిక ఎస్ ఐ కారణమని, పెళ్లి చేసుకుని స్టేషన్ కు వెళ్తే.. పోలీసులు అమ్మయి తరుఫున మాట్లాడారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించి ఆస్పత్రి ముందు బైటాయించారు. అనంతరం ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్థానిక మండల కేంద్రంలో స్థానిక ఎస్ ఐ ప్రేమ జండను విడదీశారని పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. పెళ్లి చేసుకున్న అమ్మాయి మాట మార్చడంతో తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.