సభ్య సమాజం తల దించుకునే ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మగాళ్లకు కూడా సమాజంలో రక్షణ లేదన్న విషయం ఈ ఘటన ద్వారా తేటతెల్లం అవుతోంది. మగాళ్లకు తోడుగా నిలవాల్సిన కొందరు ఆడవాళ్లే.. వారిపై తాటకిపర్వానికి ఒడిగడుతున్నారు. తాజాగా, ఓ యువకుడిపై నలుగురు యువతులు దారుణానికి ఒడిగట్టారు. అతడ్ని కిడ్నాప్ చేసి మరీ, అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పంజాబ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్లోని జలందర్కు చెందిన ఓ యువకుడు అక్కడి ఓ కర్మాగారంలో పని చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడు జలందర్ – కాపుర్తలా రోడ్లోని లెదర్ కాంప్లెక్స్ దగ్గర నిలుచుని ఉన్నాడు.
ఇంతలో ఓ కారు వచ్చి అతడి పక్కగా ఆగింది. అందులోంచి ఓ ఇద్దరు అమ్మాయిలు కిందకు దిగి అతడి దగ్గరకు వచ్చారు. ఓ అడ్రస్ గురించి అతడ్ని అడిగారు. అతడు చెప్పసాగాడు. లోపల మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి బయట ఉన్న ఇద్దరు అమ్మాయిలు అతడ్ని పట్టుకున్నారు. బలవంతంగా కారులోకి తోశారు. అనంతరం బాధితుడికి మత్తు మందు ఇచ్చారు. మత్తు మందు కారణంగా అతడు స్ప్రహ కోల్పోయాడు. ఇక కారులోని వారు ఒక్కొక్కరిగా అతడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అలా కొద్దిసేపు అతడిపై అత్యాచారం చేసిన తర్వాత ఓ చోట కారును ఆపారు. అక్కడ బాధితుడ్ని కిందపడేసి వెళ్లిపోయారు. కొద్ది సేపటి తర్వాత అతడికి స్ప్రహ వచ్చింది. ఇక, తనపై జరిగిన అన్యాయాన్ని తలుచుకుని అతడు కుమిలికుమిలి ఏడ్చాడు.
అయితే, ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేక నరకయాతన అనుభవించాడు. కొద్ది రోజుల ఇబ్బంది తర్వాత ఈ విషయాన్ని బయటకు చెప్పాడు. ప్రసుత్తం ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై పురుష సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సదరు బాధితుడికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. అతడికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, దేశ వ్యాప్తంగా నిరసలు చేపడతామని పురుష సంఘాలు వెల్లడించాయి. నిందితురాళ్లను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాయి. ఇక, ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందకపోవటం గమనార్హం.