ఈ యువకుడి పేరు వంశీ. గత కొంత కాలంగా పెళ్లైన మహిళలో తరుచు ఫోన్ లో మాట్లాడుకునేవారు. వీరి వ్యవహారం చాలా కాలంగా కొనసాగుతున్న తెలుస్తుంది. కట్ చేస్తే.. ఊహించని ఘటన చోటు చేసుకుంది.
అది జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం. ఇక్కడే వంశీ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా ఓ కారు డ్రైవింగ్ స్కూల్ లో పని చేసేవాడు. ఇదిలా ఉంటే.. అతడు గత కొంత కాలంగా ఓ వివాహితతో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నాడు. వీరి వ్యవహారం చాలా కాలం నుంచి కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇకపోతే, ఇటీవల వీరి వ్యవహారంపై ఊహించని ఘటన చోటు చేసింది. ఈ ఘటనతో అంతా షాక్ గురవుతున్నారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లాలోని బీర్ పూర్ లో వంశీ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా ఓ డ్రైవింగ్ స్కూల్ లో పని చేస్తుండేవాడు. ఇదిలా ఉంటే.. వంశీకి గతంలో స్థానికంగా ఉండే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొంత కాలం పాటు ఇద్దరూ ప్రేమ విహారంలో తేలియాడారు. అయితే, వీరి ప్రేమ వ్యవహారం గతంలో యువతి ఇంట్లో తెలిసింది. అలెర్ట్ అయి ఆ యువతికి ఆమె కుటుంబ సభ్యులు మరో యువకుడితో వివాహం జరిపించారు. కట్ చేస్తే.. వంశీ మాత్రం ఆ యువతిని మరిచిపోలేకపోయాడు. తరుచు ఆమెతో ఫోన్ లో మాట్లాడేవాడని తెలుస్తుంది. ఈ మ్యాటర్ మరోసారి యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది.
పద్దతి మార్చుకోవాలంటూ వంశీని హెచ్చరించారు. అయినా సరే అతడు యువతిపై ప్రేమతో మాట్లాడేవాడట. ఇక తట్టుకోలేకపోయిన ఆ వివాహిత కుటుంబ సభ్యులు వంశీని చంపాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే వంశీ కొల్వాయి నుంచి తుంగూరుకు బైక్ వస్తున్నాడిని తెలుసుకున్నారు. దారి మధ్యలో అతడిని అడ్డగించి అందరూ చూస్తుండగానే ఆ దుర్మార్గులు వంశీని దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత వంశీ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నాకు దిగారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.