హైదరాబాద్, జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. సీఎస్ఆర్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని మేఘనారెడ్డి(21) సూసైడ్ చేసుకుంది. విద్యార్థిని మేఘనారెడ్డి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫోర్త్ ఇయర్ చదువుతున్న మేఘన బుధవారం.. సీఎస్ఆర్ బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మేఘనా రెడ్డి ఆత్మహత్యకు.. అనారోగ్య సమస్యల కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మేఘనా రెడ్డి.. మానసికంగా ఇబ్బందులకు కావడం, అందుకు తగిన ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.