వ్యభిచారం వద్దన్నందుకు భర్తను చంపిన భార్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనలో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య ఓ బాలికతో చేతులు కలిపి కట్టుకున్న భర్తను పథకం ప్రకారం దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో తాజాగా వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు ఏంటి? అసలు తాళికట్టిన భర్త చంపడానికి దారి తీసిన అసలు కారణాలు మీ కోసం. పోలీసుల కథనం ప్రకారం.. అది హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని షాపర్ నగర్ సంజయ్ గాంధీ నగర్ ప్రాంతం. ఇక్కడే రేణుక అనే మహిళ ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది.
ప్రేమించి పెళ్లి:
రేణుక 2016లో సురేష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు భర్తతో దాంపత్య జీవితాన్ని కొనసాగించింది. అయితే ఈ ఇల్లాలు రాను రాను చెడు మార్గాల వైపు అడుగులు వేసింది. మద్యానికి అలవాటు పడి వ్యభిచారంలోకి వెళ్లింది. అలా కొన్నాళ్ల పాటు భర్తకు తెలియకుండా బాగానే సీక్రెట్ బిజినెస్ చేస్తూ వచ్చింది. అయితే కొన్నాళ్ల తర్వాత భార్య చీకటి బిజినెస్ భర్త చెవిన పడింది. దీనిని తట్టుకోలేకపోయిన భర్త సురేష్.. ఇలాంటి పాడు పనులు వద్దని, బుద్దిగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. తాను నడిపిస్తున్న వ్యభిచారానికి భర్త అడ్డుగా ఉండడంతో రేణుకకు ఓ ఆలోచన వచ్చింది. అదే భర్తకు మరో పెళ్లి దగ్గరుండి చేయడం.
భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య:
గతంలో రేణుకకు బహదూర్ పల్లిలో కల్లు దుకాణం వద్ద ఓ అనాథ బాలికతో పరిచయం పెంచుకుంది. మెల్ల మెల్లగా ఆ బాలికతో స్నేహం చేసి కొన్ని రోజుల తర్వాత తన ఇంటికి తెచ్చుకుంది. ఆ తర్వాత ఆ బాలికను నమ్మించి ఇంట్లోనే భర్త సురేష్ కు సీక్రెట్ గా రెండో పెళ్లి చేసింది. దీంతో గత 15 రోజుల నుంచి ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇక సురేష్ రెండో పెళ్లి చేసుకున్న బాలికతో మరింత దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే సురేష్.. తన మొదటి బార్య రేణుకను వదిలించుకునే ప్రయత్నం కూడా చేశాడట. ఇదే భార్య రేణుకకు అస్సలు నచ్చకపోవడంతో భర్తతో గొడవకు దిగింది. ఇక ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రేణుక ఆ బాలిక సాయంతో భర్తను చంపాలని ప్లాన్ గీసింది.
భర్త హత్యకు ప్లాన్:
భర్త హత్యలో భాగంగా రేణుక, సురేష్, ఆ బాలిక.. ముగ్గురూ కలిసి ఆదివారం ఇంట్లో మద్యం సేవించారు. అనంతరం భర్త మత్తులోకి జారుకున్నాడు. దీంతో వెంటనే భార్య రేణుక ఆ బాలికతో చేతులు కలిసి భర్త సురేష్ ను గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది. అనంతరం అదే రాత్రి భర్త శవాన్ని ఓ గోనె సంచిలో పెట్టి వీరు అద్దెకు ఉంటున్న ఇంటి ముందే పడేసింది. ఇక రేణుక ఉదయాన్నే ఏం తెలియనట్టు పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసి.. నా భర్తను ఎవరో హత్య చేశారంటూ పోలీసులను నమ్మిస్తూ రాక్షస ప్రేమతో కన్నీళ్లు కార్చింది. ఇక రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయితే పోలీసులకు ఎందుకో మృతుడి భార్య రేణుకపై అనుమానం వచ్చింది. విచారణలో భాగంగా పోలీసులు ముందుగా రేణుకను విచారించారు. ఆ మహిళ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఆమెపై మరింత అనుమానం బలపడింది. చివరికి పోలీసుల స్టైల్ లో విచారించే సరికి.. రేణుక అసలు నిజాలు బయట పెట్టింది. నా భర్తను ఓ బాలికతో కలిసి నేనే చంపానని ఒప్పుకుంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వ్యభిచారం వద్దన్నందుకు భర్తను హత్య చేసిన కిలాడీ లేడీ రేణుక దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.