ఓ 56 ఏళ్ల వ్యక్తి 12 ఏళ్ల బాలికపై కన్నేశాడు. మాయమాటలతో ఆ బాలికను పరిచయం చేసుకుని లైంగికంగా వేధించాడు. ఇంతటితో ఆగకుండా అనేక సార్లు ఆ బాలికను బెదిరించి అత్యాచారం చేయడంతో తాజాగా ఆ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది.
దేశంలో దుర్మార్గులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. 3 ఏళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముసలవ్వల వరకు ఇలా ఎవరినీ వదలకుండా అత్యాచార దాడులకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మూర్ఖుడు చేసిన దారుణానికి ఓ అమాయక బాలిక తల్లి కావాల్సి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.
దేశంలో ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా.. అత్యాచార దాడులు మాత్రం ఆగలేకపోతున్నాయి. అది హర్యానా ఫరీదాబాద్ లోని ఓ ప్రాంతం. ఇక్కడే ఓ 56 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే ఇతను ఉంటున్న ఇంటి పక్కనే ఓ 12 ఏళ్ల బాలిక నివాసం ఉండేది. దీంతో ఆ వ్యక్తి ఆ బాలికపై కన్నేశాడు. ఎలాగైన ఆ బాలికతో కోరిక తీర్చుకోవాలని మాటలు కలిపి తన ముగ్గులోకి దింపుకున్నాడు. ఆ తర్వాత ఆ బాలికను బెదిరించి ఈ నీచుడు అనేక సార్లు అత్యాచారం చేస్తూ వచ్చాడు.
దీంతో ఆ బాలిక ఇటీవల గర్బవతి అని తేలడంతో పాటు తాజాగా ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణాన్ని తట్టుకోలేని బాధిత బాలిక తల్లిదండ్రులు ఒంటికాలుపై లేచి నిందితుడిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.