Grama Volunteer: ఓ మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను బెదిరించి గత మూడు నెలలుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ సంఘటన బాపట్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా, కొరిశపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన రావిపాటి కోటయ్య గ్రామ వాలంటీర్గా పని చేస్తున్నాడు. అతడికి ఇది వరకే పెళ్లైంది. అయినప్పటికి అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. సదరు బాలిక తల్లిదండ్రులు ఉపాధికోసం వేరే ఊరిలో ఉంటున్నారు. బాలిక అమ్మమ్మ దగ్గర ఉంటోంది. తల్లిదండ్రులు దూరంగా ఉండటంతో తనపై జరుగుతున్న దారుణాన్ని ఎవ్వరికీ చెప్పలేకపోయింది.
ఈ నేపథ్యంలో అతడి ఆగడాలు శ్రుతి మించడంతో తట్టుకోలేకపోయింది. తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు కోటయ్యపై ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత బాలికను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
E Tv pic.twitter.com/P9jMOdL4Fi
— Rajasekhar (@Rajasek61450452) May 31, 2022
ఇవి కూడా చదవండి : Gold Mine: బంగారు గనుల్లో దొంగల భీభత్సం.. 100 మంది మృతి!