ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడుస్తున్న విషయాల్లో ‘కల్తీ’ కూడా ఒకటి. మన తీసుకునే ప్రతి ఆహార పదార్థం కూడా ఎక్కడో ఒక చోట కల్తీ అవుతుంది. దాంతో ఏం తింటున్నా ఒక భయంతో తినాల్సి వస్తోంది. ఆహార పదార్థాల కల్తీతో డబ్బు నష్టం అటుంచితే.. కొన్ని కోట్లు పెట్టినా రాని.. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ తర్వాత అంతుపట్టని రోగాలతో ఆస్పత్రి పాలుకావాల్సి వస్తోంది. ఇప్పటికే అనేక సార్లు ఆహార పదార్థాలు కల్తీ అయినట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వాలు, అధికారులు ఎప్పటికప్పుడూ ఈ కల్తీ భూతాన్ని తరిమికొట్టేందుకు శ్రమిస్తూ.. ఎక్కడో ఒక చోట కొంతమంది దుర్మార్గులు డబ్బుకు ఆశపడి ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. చివరి పసిపిల్లు తాగే పాలను సైతం కల్తీ చేసి.. వారి పుసురుపోసుకుంటున్నారు.
తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో ఫుడ్సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే దారుణం వెలుగుచూసింది. జిల్లాలోని ఒక ప్రైవేట్ పాల కేంద్రంలో శవాలు పాడవకుండా ఉండేందుకు వాడే ఒక ఫార్మాల్డిహైడ్ కెమికల్ను పాలల్లో కలుపుతూ.. అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తున్నారు. ఈ ప్రైవేటు పాల సేకరణ కేంద్ర నుంచి ప్రతిరోజూ.. దాదాపు 600 కుటుంబాలకు పాలు సరఫరా చేస్తున్నారు. అయితే.. ఈ పాలలో శవాలకు వాడే కెమికల్ వాడటం ద్వారా.. అతి తాగిన వారికి జీర్ణశాయ, కాలేయ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉందని ఫుడ్సేఫ్టీ అధికారులు తెలిపారు. మరి ఈ కల్తీ భూతాన్ని అధికారులు ఎలా కట్టడి చేస్తారో చూడాలి. ఈ ఘటనకు సంబంధించి.. పాల కేంద్రాన్ని సీజ్ చేయడం, నిర్వహకులపై కేసులు నమోదు చేయడం వంటి విషయాలపై ఇంకా పూర్తి సమాచారం అందలేదు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.