హోటళ్లలో బిర్యానీ తిని పలువురు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే మెదక్ లోని ఓ మండి హోటల్లో మటన్ బిర్యానీ తిని పలువురు ఆస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్లో అలాంటి సంఘటన మరొకటి చోటుచేసుకుంది.
ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడుస్తున్న విషయాల్లో ‘కల్తీ’ కూడా ఒకటి. మన తీసుకునే ప్రతి ఆహార పదార్థం కూడా ఎక్కడో ఒక చోట కల్తీ అవుతుంది. దాంతో ఏం తింటున్నా ఒక భయంతో తినాల్సి వస్తోంది. ఆహార పదార్థాల కల్తీతో డబ్బు నష్టం అటుంచితే.. కొన్ని కోట్లు పెట్టినా రాని.. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ తర్వాత అంతుపట్టని రోగాలతో ఆస్పత్రి పాలుకావాల్సి వస్తోంది. ఇప్పటికే అనేక సార్లు ఆహార పదార్థాలు కల్తీ అయినట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వాలు, అధికారులు […]