మహారాష్ట్రంలో గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టుల మధ్య జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఉదయం గ్యారపట్టి అటవీ ప్రాంతాల్లో పోలీసులు కుంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల కంట మావోయిస్టుల పడటంతో ఇద్దరి మధ్య ఎదురు కాల్పులు జరుపుకున్నారు.
దీంతో బీకరమైన కాల్పుల్లో ఇప్పటికీ ఐదుగురు మావోయిస్టులు మరణించగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గ్యారపట్టి అటవీ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే హోరాహోరిగా సాగుతున్న ఈ కాల్పుల్లో పోలీసులకు ధీటుగా ఎదురు దాడులకు దిగుతున్నారు.