ఇద్దరిదీ రెండున్నరేళ్లకు పైగా సంబంధం. ప్రియుడు తనకు దక్కడన్న బాధతో ఆ ప్రియురాలు దారుణమైన నిర్ణయం తీసుకుంది. తనకు దక్కని ప్రియుడు ఇంకెవరికీ దక్కకూడదన్న ఆలోచనతో అతడి ముఖాన్ని కాల్చేయాలని నిశ్చయించుకుంది...
తనను కాదని వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన ఓ వ్యక్తిపై వివాహిత దారుణానికి ఒడిగట్టింది. పక్కా ప్లాన్తో అతడిపై వేడి వేడి నూనె పోసింది. దీంతో అతడు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా.. నిందితురాలు జైలు పాలైంది. ఈ సంఘటన తమిళనాడులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు, ఈరోడ్లోని భవానీ ప్రాంతానికి చెందిన బీ మీనా దేవీ, కార్తీక్ డిగ్రీ చదివే సమయంనుంచి మంచి స్నేహితులు. మూడేళ్ల క్రితం మీనా దేవికి కార్తీక్ బంధువైన వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి జరిగినా వీరి స్నేహం కొనసాగింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే కార్తీక్ మరో యువతితో ప్రేమలో పడ్డాడు.
ఆమెను పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం మీనాకు తెలిసింది. తనకు ద్రోహం చేయవద్దని బ్రతిమాలింది. ఇద్దరమూ పెళ్లి చేసుకుందాం అని కూడా అడిగింది. ఇందుకు కార్తీక్ ఒప్పుకోలేదు. సదరు యువతినే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పాడు. మూడేళ్ల బంధానికి కార్తీక్ సమాధి కడుతుండటంతో మీనా తట్టుకోలేకపోయింది. తనను కాదని వేరే యువతిని అతడు పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడటాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఎలాగైనా కార్తీక్పై పగ తీర్చుకోవాలనుకుంది. తనకు దక్కనిది వేరే వాళ్లకు దక్కకూడదు అనుకుంది. ఓ పక్కా ప్లాన్ వేసుకుంది. శనివారం కార్తీన్ను మాట్లాడటానికి పిలిచింది.
ఈ నేపథ్యంలోనే అతడి ముఖంపై బాగా కాలుతున్న నూనె పోసింది. నూనె కారణంగా కార్తీక్ కుప్పకూలాడు. బాధతో విలవిల్లాడాడు. అతడి పరిస్థితి గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నూనె దాడి ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు మీనాను అదుపులోకి తీసుకున్నారు. తనకు అన్యాయం చేస్తున్నాడన్న కోపంతోనే తాను ఈ దాడికి పాల్పడినట్లు మీనా తెలిపింది. మరి, ప్రియుడు తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడటంతో నూనె దాడి చేసిన మీనా ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.