Chikoti Praveen: మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ కేసులో ఈడి దర్యాప్తును వేగవంతం చేసింది. క్యాసినో వ్యవహారానికి సంబంధించి చికోటి ప్రవీణ్కు నలుగురు రాజకీయ ప్రముఖులతో లింకులు ఉన్నట్లు ఈడీ తేల్చింది. చికోటి వాట్సాప్ చాటింగ్ల ద్వారా వారి సమాచారం బయటపడినట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తేలింది. ఈ మేరకు మొత్తం నలుగురు రాజకీయ నాయకులకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు సోమవారంనుంచి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
కాగా, ఈడి సోదాల్లో ప్రవీణ్ కుమార్ బాలీవుడ్, టాలీవుడ్ తారలకు రూ. లక్షల్లో పారితోషకం ఇచ్చినట్లు తేలింది. దానికి సంబంధించిన లిస్ట్ ఇదే.. బాలీవుడ్ కు చెందిన నటుడు గోవిందకు రూ. 50 లక్షలు, మల్లికా శరావత్ కు రూ.కోటి, ముమైత్ ఖాన్ కు 15 లక్షలు, అమీషా పటేల్ కు రూ.80 లక్షలు, డింపుల్ హయాతీకు రూ.40 లక్షలు , గణేశ్ ఆచార్యకు రూ. 20 లక్షలు, ఈషా రెబ్బకు రూ.40 లక్షలు ఇచ్చినట్లు ఈడి సోదాల్లో బయట పడింది. దాంతో వారి పారితోషకాలపై నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి : Chikoti Praveen: 135 ఏళ్ల నాటి అనంత పద్మనాభ విగ్రహాన్ని కొన్న చికోటి ప్రవీణ్!