కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం ఆకులవారి మెరక. ఇదే ప్రాంతాని చెందిన జ్యోతి అనే యువతికి దైవాలపాలెంకు చెందిన మేడిశెట్టి సురేష్ తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారి ప్రేమించుకున్నారు. ఇక కొంత కాలం తర్వాత వీరు పెళ్లి చేసుకోవాలని యువతి ఇంట్లో చెప్పారు. కానీ వీళ్లు ఒప్పుకోకపోవడంతో వారిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అందరూ కలిసిపోయి సంతోషంగా జీవిస్తున్నారు. అప్పటి నుంచి జ్యోతి, సురేష్ సంతోషంగానే జీవిస్తున్నారు. అయితే ఆకులవారి మెరక ప్రాంతంలో గ్రామ దేవత తీర్థమహోత్సవం జరగ్గా అల్లుడు సురేష్ జ్యోతిని ఇటీవల పుట్టింటికి తీసుకువచ్చి వదిలి వెళ్లాడు.
ఇక శనివారం రాత్రి జ్యోతితో పాటు ఆమె తల్లి, తండ్రి తిని పడుకున్నారు. అదే రోజు రాత్రి ఉన్నట్టుండి అనూహ్యంగా వారి ఇంటికి మంటలు అంటుకున్నాయి. నిద్రమత్తులో ఉన్న ఈ ముగ్గురు మంటల వేడిని గుర్తించలేకపోయారు. నిమిషం, నిమిషానికి మంటలు ఇళ్లంతా వ్యాపించాయి. ఇల్లు మొత్తం అంటుకుందని గమనించిన జ్యోతి తండ్రి వెంటనే ఇంట్లో నుంచి బయటపడ్డాడు. కానీ నిద్రిస్తున్న తన భార్య, కూతురు మాత్రం బయటకు రాలేకపోయారు. ఇళ్లంత మంటలు అంటుకోవడంతో తల్లి కూతురు గమనించే లోపు ప్రమాదవశాత్తు తల్లీకూతుళ్లు సజీవదహనమయ్యారు.
ఇది కూడా చదవండి: Woman: భర్తకి అన్యాయం చేస్తూ.. లవ్ యూ సోనా అంటూ లెటర్ రాసి!
భార్య, కూతురు మంటల్లో సజీవదహనం కావడంతో ఆ వ్యక్తి కన్నీరు మున్నీరుగా విలిపించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జ్యోతి కుటుంబ సభ్యులు అల్లుడు సురేష్ పై అనుమాన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వారు నివాసం ఉంటున్న ఇంట్లో ఓ సారి అగ్ని ప్రమాదం సంభవించిందని, అప్పుడు అతని మీదే అనుమానం వేసింది అని తెలిపారు. ఇక ఇప్పుడు ఈ ప్రమాదంలో తల్లీకూతురు సజీవదహనమవ్వడానికి అల్లుడు సురేషే కారణమంటూ జ్యోతి బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఆరోపణలు విన్న పోలీసులు సురేష్ ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.