బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనున్నారు. ఇందుకోసం మంచి మార్కులతో పాస్ అవుతూ టీచర్ల మెప్పు కూడా పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తికావడంతో ఇద్దరూ తినడానికి సరదాగా ఓ హోటల్ కు వెళ్లారు. కానీ, అక్కడ జరిగిన దారుణం చూసి వీరి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు.
వాళ్లు జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బాగా చదువుకుని జీవితంలో ఉన్నతమైన హోదాల్లో స్థిరపడాలని కలలు కన్నారు. ఇందుకోసం బాగా చదువుకుంటూ తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకొస్తున్నారు. అయితే ఇటీవల పరీక్షలు పూర్తి కావడంతో సరదాగా ఇద్దరు బయటకు వెళ్లారు. కానీ, అక్కడ జరిగిన దారుణం తెలుసుకుని వీరి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనలో అసలేం జరిగింగిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పోలీసుల కథనం మేరకు.. అది ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా. బొమ్మూరుకు చెందిన లక్ష్మీ నారాయణ (15), ఎర్రకొండకు చెందిన లాస్య (15) ఇద్దరూ బొమ్మూరులోని ఓ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనున్నారు. ఇందుకోసం మంచి మార్కులతో పాస్ అవుతూ టీచర్ల మెప్పు కూడా పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తికావడంతో ఇద్దరూ తినడానికి సరదాగా ఓ హోటల్ కు వెళ్దామనుకున్నారు. ఇందులో భాగంగానే స్నేహితులతో కలిసి బైక్ లపై లాలా చెరువుకు బయలు దేరారు. ఇక కవ్వలగొయ్యికి చేరుకోగానే జాతీయ రహదారిపై లక్ష్మీనారాయణ ముందున్న లారీని తప్పించే ప్రయత్నం చేశాడు. కానీ అదుపు తప్పి వీరి బైక్ డివైడర్ ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే వారు చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తుంది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.