ప్రేమించడం తప్పు కాదూ కానీ, ప్రేమించ లేదని, ప్రేమను అంగీకరించలేదని, ప్రేమించిన వారు దూరమయ్యారన్న కారణంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు నేటి యువత. అటువంటి సంఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.
రెండు హృదయాలను దగ్గర చేసేదే ప్రేమ. యువతీ యువకులు తమ ప్రేమను వ్యక్తం చేశాక, పొద్దున నుండి రాత్రి నిద్రపోయే వరకు వారి గురించి ఆలోచనలే చేస్తుంటారు. అభిరుచులు, అభిప్రాయాలు కలిశాక మరింత దగ్గరవుతారు. ఒకరి విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరుకుంటారు. జీవితంలో సెటిల్ అయ్యాక వారి ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించేందుకు పెద్దల వాళ్లను ఒప్పించేందుకు పాట్లు పడతారు. ఎన్నో కలలు కంటారు. కానీ అదే ప్రేమ విఫలమైతే అఘాయిత్యాలకు పాల్పడతారు. ఇష్టపడ్డ వారు లేకపోతే జీవితమే లేదన్నభ్రమలో బ్రతికేస్తారు. వారూ లేని జీవితాన్ని ఊహించుకోలేరు. ప్రియుడు దూరమయ్యాడన్న కారణంగా ఓ యువతి తీసుకున్న నిర్ణయం అందర్నీ కలచివేసింది.
వివరాల్లోకి వెళితే తమిళనాడులోని తరివళ్లూరు జిల్లాకు చెందిన వసంత్, వినోదిని మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వసంత్ది ముత్తాపుదు పేట సమీపంలోని కరిమేడు కాగా, వినోదినిదీ ఆవడీ సమీపంలోని కోవిల్ పతాగై ప్రాంత వాసి. ఆమె అళగప్ప యూనివర్శిటీలో ఎంబిఎ చదువుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన వసంత్ గుమ్మడిపూండిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రేమించిన వ్యక్తి లేడన్న విషయాన్నిజీర్ణించుకోలేక పోయానన్న వినోదినీ, తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. అతడు లేని జీవితాన్ని ఊహించుకోలేనని భావించిన యువతి తీవ్ర నిర్ణయం తీసుకుంది.
తెల్లవారితే పండుగ అనుకున్నసమయంలో కుమార్తె వినోదిని ఇంట్లో శవమై కనిపించింది. ఇంట్లో ఉరి వేసుకుని కనిపించడంతో తండ్రి రాజేంద్రన్ కన్నీటి పర్యంతమయ్యాడు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆవడి ట్యాంక్ ఫ్యాక్టరీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తరలించారు. ప్రేమించిన వారు లేరన్న కారణంగా ఆత్మహత్య చేసుకోవడం సరైన నిర్ణయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనాలోచిత నిర్ణయాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. దేశానికి పట్టుకొమ్మలైన యువతీ యువకులు ప్రేమ అనే ఫీలింగ్స్ కోసం నిండు జీవితాలను కాలరాసుకుంటున్నారు. ప్రియుడు లేడన్న కారణంగా యువతి ఆత్మహత్య చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.