మహిళల్ని చూస్తే చాలు కొంత మంది వెధవలు తమలోని కామ వాంఛలను నిద్ర లేపుతుంటారు. తమ లైంగిక కోరికలు తీర్చుకునేందుకు ఎన్నో ఘోరాలు, దారుణాలు చేస్తుంటారు. అభం శుభం ఎరుగని చిన్న పిల్లల దగ్గర నుండి కాటికి కాలుచాపే ముదసలి
ప్రస్తుత కాలంలో రోజు రోజుకు కామాంధుల సంఖ్య పెరిగిపోతుంది. మహిళల్ని చూస్తే చాలు కొంత మంది వెధవలు తమలోని కామ వాంఛలను నిద్ర లేపుతుంటారు. తమ లైంగిక కోరికలు తీర్చుకునేందుకు ఎన్నో ఘోరాలు, దారుణాలు చేస్తుంటారు. అభం శుభం ఎరుగని చిన్న పిల్లల దగ్గర నుండి కాటికి కాలుచాపే ముదసలి వరకు ఎవ్వరినీ వదలడం లేదు. ఆడదైతే చాలు ..వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ నీచుడు పసిబిడ్డను బెదిరించి.. అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన తెలంగాణలోని కుమరం భీమ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఏడేళ్ల బాలికపై తాత వయస్సు వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన కాగజ్ నగర్లో చోటుచేసుకుంది. పెద్ద వాగు రోడ్డులోని సి బాపు కాలనీలో ఉన్న చర్చిలో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు 55 ఏళ్ల రమేష్. ఆ కాలనీకి చెందిన పిల్లలు రోజూ చర్చి ఫాదర్ ఇంటి సమీపాన వచ్చి ఆడుకుంటూ ఉంటారు. సోమవారం కూడా పిల్లలు రాగా, చర్చి ఫాదర్ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన రమేష్.. పిల్లల్లో ఓ ఏడేళ్ల చిన్నారిని కర్రతో బెదిరించి బాత్రూంకు లాకెళ్లాడు. అనంతరం అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు తుక్కు ఏరుకుని అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. పనులు నిమిత్తం ఆమెను అమ్మమ్మ వద్ద వదిలేసి వెళ్లిపోయారు.
బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో అతడి భార్య ఇంట్లో ఉన్నప్పటికీ.. పనిలో ఉండటంతో గమనించలేదు. తీవ్రంగా రక్తమోడుతూ ఉన్న చిన్నారి ఏడ్చుకుంటూ అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఏం జరిగిందో చెప్పడంతో బాలిక కుటుంబ సభ్యులు.. చర్చి వద్దకు వెళ్లి రమేష్ ను చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో .. రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని చికిత్స కోసం ఆసుప్రతికి తరలించారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ నాగరాజు తెలిపారు.