ఆ యువతి ఎంబీఏ చదువుతుంది. ఆమె క్లాస్ మేట్ తో కలిసి ఓయో రూమ్ కి వెళ్ళింది. కట్ చేస్తే మరో నలుగురు క్లాస్ మేట్స్ కూడా వారి కోరిక తీర్చాలంటూ వెంటపడడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి క్లాస్ మేట్ తో కలిసి ఓయో రూమ్ కి వెళ్లడమే పాపం అయిపోయింది. అంతే అప్పటి నుంచి ఆమెను బలవంతం చేస్తూ వచ్చారు. కానీ ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశారు.
ఓయో రూమ్ లంటే ఒక రకమైన విరక్తి భావన వచ్చేలా చేసింది నేటి యువతే. ఈ రూమ్ లు ఉన్నది అందుకేనా అనే భావన వచ్చేలా చేశారు. అయితే ఓయో రూమ్ వెళ్లే అందరూ ఇష్టంతోనే అనుకుంటే పొరపాటే. కొంతమంది అమాయకత్వంతో నమ్మి వెళ్తే.. కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక వెళ్లాల్సి ఉంటుంది. వేరే దారి లేక స్నేహితుడి కోరిక తీర్చడానికి వెళ్లిన యువతి వీడియో తీయడమే గాక దాన్ని వాట్సాప్ లో ఫ్రెండ్స్ గ్రూపుల్లో వైరల్ చేశారు. ఈ ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నారాయణగూడలోని ఓ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న యువతి తన క్లాస్ మేట్ దగ్గర కొంత డబ్బు తీసుకుంది.
అయితే ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆ యువతి అప్పు తీర్చలేకపోయింది. దీంతో ఆమె స్నేహితుడు ఆమెపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఆమె ఇవ్వలేదని తెలిసి అదునుగా భావించాడు. ఈ సాకుతో ఆమెను లొంగదీసుకుని అనుభవించాలని చూశాడు. తాను చెప్పినట్టు చేస్తే అప్పు తీర్చక్కర్లేదని మాయ మాటలు చెప్పాడు. తన కోరిక తీరిస్తే అప్పు మాఫీ చేస్తానని నమ్మించాడు. వేరే గత్యంతరం లేక ఆ అమ్మాయి అంగీకరించింది. ఆ యువతి, ఆమె స్నేహితుడు ఇద్దరూ కలిసి నారాయణగూడలోని ఓయో రూమ్ కి వెళ్లారు. ఇద్దరూ ఏకాంతంగా గడిపిన దృశ్యాలను సదరు స్నేహితుడు రహస్యంగా చిత్రీకరించాడు. ఆ వీడియోని నలుగురి స్నేహితులకు చూపించాడు.
అప్పటి నుంచి వీడియో తీసిన వ్యక్తితో పాటు అతని స్నేహితులు కూడా తమ కోరిక తీర్చాలంటూ అమ్మాయి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కోరిక తీర్చకపోతే వీడియో వైరల్ చేస్తామని బెదిరించారు. అయితే అందుకు ఆ యువతి అంగీకరించలేదు. దీంతో వాళ్ళు ఆమె వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశారు. మానసిక క్షోభకు గురైన ఆ అమ్మాయి షీ టీమ్ ను ఆశ్రయించింది. ఆ అమ్మాయి వీడియో తీసి వైరల్ చేసిన నిందితులపై కేసు నమోదు చేయాలని నారాయణగూడ పోలీసులకు షీ టీమ్ సిఫార్సు చేయడంతో ఐదుగురు యువకులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం యువకులు పరారీలో ఉన్నారు. వీరిని గాలించేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.