కొంత మంది వ్యక్తులు మద్యానికి బానిసై ఏం చేయాలో తెలియక విచిత్ర పోకడలకు వెళ్తున్నారు. భార్య డబ్బులు ఇవ్వలేదని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను అమ్మటం, లేదంటే బియ్యం, బంగారం వంటి వస్తువులను తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు. ఇక తాజాగా ఏపీలోని మదనపల్లె గ్రామీణ మండలం సీటీఎం సమీపంలోని గుండవారిపల్లెకు చెందిన ఓ వ్యక్తి తాగటానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే..స్థానిక ఎస్సీ కాలనీలో లోకేష్, రమణమ్మ అనే ఇద్దరు దంపతులు నివాసముంటున్నారు. అక్కడే ఉన్నా ఇటుకల బట్టిలో పనికి వెళ్తు జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక లోకేష్ ప్రతీ రోజు మద్యానికి బానిసై భార్యను వేదించటం మొదలు పెట్టాడు. దీంతో భరించలేని భార్య భర్తను వదిలేసి వెళ్లిపోయింది. కొన్నాళ్ల తర్వాత భార్య రమణమ్మను కలుసుకున్నాడు భర్త లోకేష్. ఇక ఒక రోజు భార్యను మద్యం తాగటానికి డబ్బులు కావాలని వేదించాడు. ఎంతకూ రమణమ్మ డబ్బులు ఇవ్వకపోవటంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.