కొన్ని ప్రేమ కథలు చరిత్రలో నిలిచిపోతాయి. మరికొన్ని చరిత్రను తట్టిలేపేలే చేస్తాయి. ఇలాంటి ప్రేమకు ఎంతో శక్తి ఉంది. ఇలా ఎంతోమంది ప్రేమికులు తమ ప్రేమను కలకాలం కాపాడుకోవాలని అనుకుంటుంటారు. కానీ సమాజ ధోరణిలో వస్తున్న మార్పులు, పరువు పేరుతో తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆ ప్రేమ కథలో మధ్యలోనే ముగింపు పలికి ప్రాణాలు తీసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ అందమైన ప్రేమలో అంతులేని విషాదం నిండిపోయింది. ఎన్నో ఆశలతో, మరెన్నో కలలతో కలకాలం తోడు, నీడగా ఉందామని అనుకున్నఆ జంటకు ఎన్నో అడ్డంకులు ఎదురై ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏఏడబ్ల్యూకు చెందిన గుర్రప్ప(22), పక్క గ్రామమైన అడవిశంకరపురం దళితవాడకు చెందిన పల్లవి (18) అనే యువతి గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. దీంతో కొంత కాలం పాటు వీరి ప్రేమ వ్యవహారం బాగానే నడిచింది. దీంతో పెళ్లి కూడా చేసుకోవాలని అన్నారు. దీంతోపాటు గత ఏడాది పల్లవికి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ప్రయత్నించారు. మైనర్ అనే కారణంతో పెళ్లి వాయిదా పడింది. దీంతో మరోసారి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Newlywed Bride: పెళ్లైన నెలన్నరకే భార్య 4 నెలల గర్భవతి.. నిజం తెలుసుకున్న భర్త ఏం చేశాడో తెలుసా?
ఈ క్రమంలోనే ఈ ప్రేమికులు బుధవారం సాయంత్రం అడవికొడియంబేడు నుంచి అరుణానది ఇసుక రీచ్కు వెళ్లే దారిలో శ్మశానం వద్ద ఇరువురూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం ఇరువురి తల్లిదండ్రులకు తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కంటతడి పెట్టిస్తుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.