Crime News: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువు పెడదారి పట్టాడు. క్లాసులో ఆడపిల్లల ముందే పాడు పనులు చేయటం మొదలుపెట్టాడు. దీంతో అతడి అసభ్యకర పనులు తాళలేక ఒక్కొక్కరిగా ఆడపిల్లలు స్కూలు మానుకోవటం మొదలుపెట్టారు. ఆడ పిల్లలు తండ్రులు ఏంటని వారిని అడగ్గా.. విషయం బయటపడింది. కీచక టీచర్పై కేసు నమోదైంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, మొరాబాద్ సిటీకి దగ్గరలోని బోవద్వాలా అనే గ్రామంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇస్తయాక్ మజ్రా అందులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మజ్రా క్లాస్లో ఆడ పిల్లలు ఉన్నా కూడా తప్పుగా ప్రవర్తించేవాడు. అసభ్యకర సంజ్ఞలు చేసేవాడు.
ఈ నేపథ్యంలో దాదాపు 9 మంది విద్యార్థినులు స్కూలు మానుకున్నారు. స్కూలుకు పోము అని మొండికేయటం మొదలుపెట్టారు. దీంతో వారి తల్లిదండ్రులు ఏంటని గట్టిగా అడిగారు. అప్పుడు వారు నిజం చెప్పారు. స్కూల్లో మజ్రా టీచర్ తమతో తప్పుగా నడుచుకుంటున్నాడని తెలిపారు. తమ పిల్లల మాటలతో తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్రాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మజ్రా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పట్టపగలే కొడవలితో వదినను చంపిన మరిది.. కారణం ఏంటంటే?