ప్రేమ.. మనిషిని ఎందాకైన తీసుకెళ్తుంది. ఈ కాలంలో వయసొచ్చిన యువతి, యువకులు ప్రేమ పేరుతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే పర్లేదు. కానీ కొంతమంది యువత మాత్రం గర్ల్ ఫ్రెండ్స్ ఉండాగానే తెరవెనుకాల మరో యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా నలుగురు అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేశాడు. అవును మీరు విన్నది నిజమే. తాజాగా పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ లోని కూచ్బెహర్ జిల్లా మత్తభంగ పట్టణ సమీపంలోని జోర్పట్కి అనే గ్రామంలో సుభమోయ్ కర్ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఇక
స్థానికంగా మెడికల్ స్టోర్స్ లో సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్న సుభమోయ్ కాలాన్ని వెల్లదీస్తూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే మనోడు ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ఏకంగా నలుగురు అమ్మాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ లోకి దింపాడు. దీంతో కొంత కాలం అలాగే గుట్టుచప్పుడు కాకుండా మెయింటేన్ చేస్తూ వచ్చాడు.
ఇక కొన్నాళ్ల తర్వాత ప్రియుడిపై ఆ నలుగురు అమ్మాయిలకు అనుమానం వచ్చింది. ఆ అనుమానం నిజమని తేలటంతో ఒకేసారి ఆ నలుగురు యువతులు సుభమోయ్ ఇంటికి వెళ్లారు. ఆ నలుగురు యువతులను చూసిన మనోడికి ఒక్కసారిగా ఫ్యూజుల్ అవుటయ్యాయి. ఇక ఏం చేయాలో అర్ధం కాలేదు. ఇలా ప్రేమ పేరుతో మోసం చేస్తావా అంటూ నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ నిలదీయటం మొదలుపెట్టారు. దీంతో వారికి సమాధానం చెప్పలేక ఆ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇక విషయం తెలుసుకున్న స్థానికులు సుభమోయ్ ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక మనోడి చేసిన ఘనకార్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.