వీరికి పెళ్లై కొన్ని రోజులే అవుతుంది. నవ దంపతులు కావడంతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. జూ పార్కులు, సినిమాలు అంటూ తెగ షికారు చేస్తున్నారు. భర్త.., భార్య ఇష్టమొచ్చిన రెస్టారెంట్ కు తీసుకెళ్లడంతో పాటు నచ్చిన వస్తువులు కొనిచ్చాడు. అయితే ఇటీవల శనివారం భార్య సినిమాకు వెళ్దామని చెప్పడంతో ఇద్దరు సరదాగా సినిమాకు వెళ్లారు. వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఊహించని ప్రమాదంలో భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగ, భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పెళ్లైన కొన్ని రోజులకే ఇలా జరగడంతో భార్య పుట్టింటి వాళ్లతో పాటు అత్తింటి వాళ్లు సైతం కన్నీటి సంద్రంలో మునిగి తేలుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
అసలేం జరిగిందంటే? బెంగుళూరులోని బాణసవాడి ప్రాంతంలో ఆనంద్ (28), శ్వేత (23) అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఇటీవల కాలంలోనే వివాహం జరిగింది. నవ దంపతులు కావడంతో సరదాగా లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకున్నారు. అయితే ఇటీవల శనివారం వీకెండ్ కావడంతో ఇద్దరు బైక్ పై సినిమాకెళ్లారు. ఆనందంగా సినిమా చూసి తిరిగి ఇంటికి వస్తుండగా కళ్యాణదుర్గం వద్దకు రాగానే వీరి వెళ్తున్న బైక్ ను వెనకాల నుంచి ఓ లారీ ఢీ కొట్టింది.
వెంటనే స్పందించిన స్థానికులు హుటాహటిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. భార్య అప్పటికే ప్రాణాలు కోల్పోగా.., భర్త ఆనంద్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నిపింది. పెళ్లైన కొత్తలోనే ఈ దంపతులకు ఇలా జరగడంతో స్థానికుల కంట కన్నీరు ఆగడం లేదు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.