భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కన్నడ నాట కార్చిచ్చు రగిల్చింది. హర్ష అనే 26 ఏళ్ల వ్యక్తిని నిన్న రాత్రి (ఫిబ్రవరి 20)న 9 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనతో.. ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భజరంగ్ దళ్ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్డుపై పలు వాహనాలకు నిప్పంటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భారీగా బలగాలను మోహరించి, ఆందోళనకారులను అదుపు చేస్తున్నారు.
ಭಜರಂಗ ದಳದ ಕಾರ್ಯಕರ್ತ ಹರ್ಷರವರ ಹತ್ಯೆ ನಿಜಕ್ಕೂ ಹೃದಯ ವಿದ್ರಾವಕ ಘಟನೆ. ಮನಸ್ಸಿಗೆ ತೀವ್ರ ನೋವುಂಟು ಮಾಡಿದೆ. ಈ ಬರ್ಬರ ಕೃತ್ಯವೆಸಗಿದ ಅಪರಾಧಿಗಳಿಗೆ ಆದಷ್ಟು ಶೀಘ್ರದಲ್ಲಿ ಕಠಿಣ ಶಿಕ್ಷೆಯಾಗಬೇಕು.
ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಸದ್ಗತಿ ಕೋರುತ್ತಾ, ಭಗವಂತ ಅವರ ಕುಟುಂಬದವರಿಗೆ ಈ ನೋವು ಬರಿಸುವ ಶಕ್ತಿ ನೀಡಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. ಓಂ ಶಾಂತಿಃ pic.twitter.com/uJ80uFqlSv
— P C Mohan (@PCMohanMP) February 21, 2022
శివమొగ్గలోని భారతి కాలనీ రవిశర్మ వీధిలో ఆదివారం రాత్రి హర్షను దుండగులు దారుణంగా హత్య చేశారు. కారులో వచ్చిన దుండుగులు హర్షను వెంబడించి పదునైన ఆయుధాలతో పొడిచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న హర్షను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.టైలరింగ్ వృత్తి చేసుకుంటున్న హర్ష.. ప్రస్తుతం భజరంగ దళ్ శివమొగ్గ జిల్లా కో-ఆర్డినేటర్గా ఉన్నారు. ఈ మధ్యనే ఓ మతాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనే ఆరోపణలతో హర్షపై దొడ్డపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.
బజరంగ్ దళ్ కార్యకర్త హత్య నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండడం కోసం.. ప్రభుత్వం రెండు రోజులపాటు విద్యా సంస్థల బంద్ ప్రకటించడంతో పాటు జనాలు గుమిగూడడంపై ఆంక్షలు విధించారు. అయినప్పటికీ.. బజరంగ్ దళ్ మద్దతుదారులు హర్ష మృతదేహాంతో భారీగా ర్యాలీతో ఇంటికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా.. హిజాబ్ వివాదం వల్లే ఈ హత్య జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడం కలకలం రేపింది. దీనిని రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఖండించారు. శివమొగ్గ సమస్యాత్మక ప్రాంతం.. కాబట్టి, ఇలాంటి పుకార్లను ప్రసారం చేయకండి..సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ಶಿವಮೊಗ್ಗದಲ್ಲಿ ಹಿಂದೂ ಸಂಘಟನೆಯ ಕಾರ್ಯಕರ್ತ ಹರ್ಷ ಅವರ ಕೊಲೆ ಪ್ರಕರಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಹಲವು ಮಾಹಿತಿಗಳು ದೊರೆತಿವೆ, ತಕ್ಕ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುವುದು – ಶ್ರೀ @BSBommai, ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು. pic.twitter.com/e9g5QmPYqw
— BJP Karnataka (@BJP4Karnataka) February 21, 2022
మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. ఘటనపై స్పందించారు. పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించాయని, దర్యాప్తు వేగంగా జరుగుతోందని, నిందితులను అతిత్వరలో పట్టుకుంటామని ప్రకటించారు. మరోవైపు, ఈ హత్య కేసులో ఓ అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
#Shimoga #Harsha #BajrangDal #Karnataka pic.twitter.com/a9J53HG6e7
— Hate watch Karnataka (@Hatewatchkarnat) February 21, 2022