సరూర్నగర్లో అప్సర అనే యువతి మర్డర్ కేసు హైదరాబాద్ వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఒక పురోహితుడు ఇంతటి ఘాతుకానికి ఎలా పాల్పడ్డాడని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో అప్సర ఇంటి యజమాని కీలక విషయాలు బయటపెట్టారు.
వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటంబాలు, కాపురాలు నాశనం అవుతుండటాన్ని చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వ్యవహారాల గురించి వార్తల్లో రావడాన్ని గమనించే ఉంటారు. వీటి వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ఎక్కువవుతోంది. అది చివరకు ఎంత వరకు దారితీస్తుందో చెప్పలేని పరిస్థితి. వివాహేతర సంబంధాలు నడుపుతున్న వారి మధ్య కూడా గొడవలు జరిగి.. పరస్పర దాడులకు దిగడం, కొన్ని సందర్భాల్లో మర్డర్ చేసేవరకు వెళ్తున్నారు. అలాంటి ఒక ఘటనే హైదరాబాద్లోని సరూర్నగర్లో చోటుచేసుకుంది. సరూర్నగర్లో అప్సర్ అనే యువతి హత్య కేసు కలకలం రేపుతోంది. ఒక పూజారి ఇంతటి ఘాతుకానికి ఎలా పాల్పడ్డాడా అని చాలా మంది ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గుడిలో పూజలు చేసుకునే సాయికృష్ణ అనే పురోహితుడు.. పక్కా ప్లానింగ్తో, కిల్లర్ను మించిపోయేలా యువతిని మర్డర్ చేయడం గగుర్పాటుకు గురిచేస్తోంది.
వివాహేతర సంబంధం వల్లే అప్సర మృతి చెందిందని పోలీసులు చెబుతున్నారు. తనను మ్యారేజ్ చేసుకోవాలని చెప్పడంతోనే ఆమెను చంపినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో అప్సర ఉంటున్న ఇంటి యజమాని కీలక విషయాలు వెల్లడించారు. కొన్ని తమిళ సినిమాల్లో నటించిన అస్పర.. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి సీరియల్స్లో యాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఇంటి ఓనర్ చెప్పారు. ఈ క్రమంలో తాము ఉంటున్న ఏరియాలోని బంగారు మైసమ్మ గుడికి తరచూ వెళ్లేదన్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆలయంలో పూజారిగా ఉన్న సాయికృష్ణతో ఆమెకు పరిచయం ఏర్పడిందన్నారు. ఆ పరిచయాన్ని ఆమె కుటుంబంతోనూ సాయికృష్ణ కొనసాగించాడని ఇంటి ఓనర్ పేర్కొన్నారు. ఇద్దరిదీ ఒకే కమ్యూనిటీ కావడంతో త్వరగానే కలసిపోయారని.. అక్కయ్య గారు అంటూ అప్సరతో సాయికృష్ణ వరుస కలిపాడన్నారు.
అప్సర ఇంటి ఓనర్ చెప్పిన ప్రకారం.. అక్కయ్య అంటూ ఆమెతో వరుస కలిపి మరింత దగ్గరయ్యాడు సాయికృష్ణ. అప్సర ఇంటికి అతడు తరచూ వస్తుండేవాడు. రాత్రి 11 గంటల వరకు వాళ్ల ఇంట్లోనే ఉండేవాడు. కొన్ని రోజులు అర్ధరాత్రుళ్లు కూడా అక్కడే ఉండేవాడు. మిడ్నైట్ వాళ్లిద్దరూ బైక్ మీద బయటికి వెళ్లేవారు. ఇదే విషయమై ఇంటి ఓనర్ కొడుక్కి అనుమానం వచ్చి పూజారి సాయికృష్ణ పదే పదే ఇంటికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే.. వాళ్లిద్దరి మీద ఉన్న సదభిప్రాయంతో తామే కొడుక్కి నచ్చజెప్పామని.. ఇంటి యజమాని చెప్పుకొచ్చారు. అయితే అప్సర-సాయికృష్ణ మధ్య అలాంటి బాగోతం నడుస్తోందని మాత్రం తమకు తెలియదన్నారు. ఒకవేళ అప్సర-సాయికృష్ణ వ్యవహారం గురించి ముందే తెలిస్తే అప్పుడే ఇల్లు ఖాళీ చేయించేవాళ్లమని చెప్పుకొచ్చారు.