వివాహితపై కుత్తీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే, కుత్తీస్పై ఆమె తిరిగి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఇద్దర్నీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత రోజు కూడా కౌన్సిలింగ్ రమ్మన్నారు.
ఈ మధ్యకాలంలో చాలా మంది యువత చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకుని జీవితాన్ని చిందరవందర చేసుకుంటున్నారు. సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు. చిలికి చిలికి గాలి వానలా చిన్నసమస్యలను పెద్దవి చేసి తమ జీవితాలకు చరమాంకం పాడుతున్నారు. అలాంటిదే అనంతపురం జిల్లా రాయదుర్గంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన కుత్తీస్ అలియాస్ ఫృథ్వీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తున్నాడు. అదే పట్టణానికి చెందిన ఓ వివాహితతో కుత్తీస్కు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలోనే ఆమెతో చనువుగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను, ఫోన్ మెసేజ్లను చూపించి వివాహిత వేధిస్తోందని అతడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ వివాహిత.. కుత్తీసే తనను ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఒకరి మీద ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివాహిత వారం రోజుల క్రితం స్పందనలో కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరినీ పిలిచి విచారణ జరిపారు. తిరిగి శనివారం తదుపరి విచారణకు రమ్మన్నారు. గురువారం రాత్రి వివాహిత కుత్తీస్ని తన ఇంటికి రమ్మని వేరే వ్యక్తితో కబురు పంపింది. కుత్తీస్ భార్య లలిత ఆమె దగ్గరకు వెళ్లవద్దని నివారించింది. శుక్రవారం పెళ్లికి వెళ్లి వచ్చిన తర్వాత శనివారం విచారణకు వెళ్దామని చెప్పింది.
కానీ, అతడు వినలేదు. తప్పనిసరి పరిస్థితిలో వివాహిత దగ్గరకు వెళ్లాడు. అతడి భార్య లలిత శుక్రవారం పెళ్లికి బయలుదేరింది. అయితే, లలిత మార్గం మధ్యలో ఉండగానే ఆమె భర్త ఉరేసుకుని చనిపోయాడని వార్త తెలిసింది. దీంతో ఆమె హుటాహుటిన ఇంటికి వచ్చింది. భర్త శవాన్ని చూసి విలవిల్లాడిపోయింది. తన భర్త ఆత్మహత్యకు కారణం వివాహిత వేధింపులే అని పోలీసులకు చెప్పింది. పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని నిరసన తెలిపింది. ఆమెకు మద్దతుగా కుత్తీస్ స్నేహితులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడినుంచి పంపేశారు. వివాహితపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత బాధితులు పట్టణంలో ఇంకా చాలా మంది ఉన్నారని తెలిపారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.