Amnesia Pub Case: బెంజ్లో ఎక్కించారు.. ఇన్నోవాలో అత్యాచారం చేశారు. జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నోవా కారులో నిందితుల స్పెర్మ్ను సేకరించింది క్లూస్ టీమ్. దీంతో బాలికపై ఇన్నోవాలోనే అఘాయిత్యం జరిగిందనే నిర్ణయానికి వచ్చారు పోలీసులు. స్పెర్మ్తో పాటు, నిందితుల వేలిముద్రలు, చెవికమ్మలు, తల వెంట్రుకలు, చెప్పులు తదిరత ఆధారాలను క్లూస్ టీమ్ సేకరించింది. ఇటు బెంజి కారులో కూడా చెప్పుల జతలతో పాటు, రెండు షటిల్ కాక్లు, టేపు మాస్క్లు తదితర వస్తువులను సీజ్ చేశారు. మొదట అమ్నీషియా పబ్బు నుంచి బాలికను బెంజర్కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు నిందితులు.
అటు నుంచి జూబ్లీహిల్స్ లో ఉన్న కేన్స్ బేకరీ దగ్గరకు వెళ్లి, అక్కడ కొన్ని తినుబండారాలు కొన్నారు. అక్కడే కారు మార్చేసి, బాలికను ఇన్నోవా కారులోకి ఎక్కించారు. బెంజ్ కారు విజువల్స్, ఫొటోలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. బాలికను ఇన్నోవాలోకి ఎక్కించిన తర్వాతే ఆమెపై అఘాయిత్యం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇన్నోవాలో బాలికపై బలవంతంగా ఐదుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు.
దారుణం ఏంటీ? అంటే ఇన్నోవాను జూబ్లీహిల్స్లోని వివిధ రోడ్లలోనే తిప్పారు. కారు రోడ్డుపై వెళ్తుండగానే బాలికపై రేప్ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత బాలికను తీసుకొచ్చి ఆమ్మీషియా పబ్ దగ్గరే వదిలేశారు. ఆ తర్వాత పబ్ నుంచి మళ్లీ బేకరీ దగ్గరకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగి, వాటిని నిందితులు ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Chennai: టీవీ చూడొద్దన్న తల్లి..! కూతురు చేసిన పనికి అంతా షాక్!