Amnesia Pub Case: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటన వెలుగులోకి వచ్చిన కొద్ది సమయానికే.. ఈ కేసుకు సంబంధించి సూరజ్, హాదీ అనే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన బాలిక(17) గత నెల 28న జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 36లోని అమ్నీషియా పబ్లో జరిగిన మైనర్ పార్టీకి వెళ్లింది. కొద్దిసేపు ఉండి పబ్ నుంచి బయటకు వచ్చింది. ఇంటికి వెళ్లిన బాలిక మెడపై గాట్లు ఉండడం గమనించిన తండ్రి ఆరా తీశాడు. దీంతో తనతో ఉన్న యువకులు అసభ్యంగా ప్రవర్తించారని తండ్రికి తెలిపింది.
దీంతో జరిగిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు. అయితే.. మైనర్పై అత్యాచారం చేసిన వారిలో రాజకీయ నాయకుల వారసులు ఉండటంతో పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అమ్నీషియా పబ్ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరి.. ఐదుగురు నిందితుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ-1.. సాదుద్దీన్ ఇతను ఎంఐఎం నేత కొడుకు. ఏ-2 .. ఉమేర్ఖాన్ ఓ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు. మైనర్-1.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు మైనర్-2.. ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు, మైనర్-3.. సంగారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ కొడుకు ఉన్నారు. ఇదిలా ఉండగా.. మైనర్పై అత్యాచార కేసుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరా రాజన్ స్పందించారు. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. 2 రోజుల్లో నివేదికను అందించాలని ఆదేశించారు. మరోవైపు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు..
లైంగిక దాడి అనంతరం కారులో మొయినాబాద్కు వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్లో ఆశ్రయం పొందారని తెలుస్తోంది. మరి.. ఆ నేత ఎవరు అన్న విషయంలో కూడా పోలీసులు విచారిస్తునట్టు సమాచారం. ఇక.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ కేసులో ఇంతటి వారు ఉన్నా.. ఉపేక్షించవద్దు అని, బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలి అంటూ.. పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మరి.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Husband: క్షమాపణ చెప్పినా పట్టించుకోలేదు.. కోపంతో భార్య ముక్కు కొరికేశాడు..