కాస్త చికటి పడితే చాలు ఊరంత ప్రశాంతంగా మారిపోతుంది. రాత్రి 7 దాటిందా.. బయట ఒక్క మనిషి పురుగు కూడా కంటికి కనిపించదు. ఇలాంటి భయంకరమైన సమయంలో ఎవరైన బయట అడుగు పెట్టాలంటే వెన్నులో వణుకు పడుతుంది. భయం కమ్ముకున్న ఈ రోజుల్లో ఇటీవల ఓ రోజు 26 ఏళ్ల యువతి బాత్రూంకి కోసమని గడప దాటి అడుగు పెట్టింది. దీంతో వెంటనే ఆ యువతి అరుపులు, కేకలతో కాలనీ అంతా దద్దరిల్లిపోయింది. ఏం జరిగిందని తండ్రి బయటకెళ్లి చూసే సరికి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అసలేం జరిగింది. ఈ గ్రామంలోని ప్రజలు అంతగా భయపడాల్సిన విధంగా ఏర్పడిన పరిస్థితులు ఏంటి? ఇంతకి ఆ 26 ఏళ్ల యువతి అరుపుల వెనకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అది హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు సమీపంలో జాబలి అనే గ్రామం. స్థానికంగా ఉండే గ్రామాల్లో పులి తిరుగుతూ ఏ మనిషి కనిపించినా చంపేసి తినేస్తుంది. దీంతో అర్థరాత్రి దాటిందనే చాలు జనాలంతా అడుగు బయటకు పెట్టాలంటే భయపడిపోతుంటారు. అయితే ఇటీవల ఓ రోజు రాత్రి 7 గంటలకు 26 ఏళ్ల పూజా అనే యువతి బాత్రూంకి వెళ్దామనుకుని బయటకు వచ్చింది. ఇక కాచుకుని ఉన్న పులి మెల్లగా ఆ యువతిని నోటితో పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లింది. ఇక ఒక్కసారిగా ఆ యువతి నుంచి అరుపులు, కేకలు భారీగా వినిపించాయి.
ఏం జరిగిందని తండ్రి బయటకు వచ్చేసరికి పులి ఆ యువతిని ఇంకా ముందుకు ఈడ్చుకుంటూ వెళ్లింది. వెంటనే స్థానిక జనాలు బయటకు వచ్చి కత్తులు, కర్రలతో బెదరించే ప్రయత్నం చేశారు. ఇక జనాలందరినీ చూసిన పులి వెంటనే భయపడి ఆ యువతిని వదిలేసి పారిపోయింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.