మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఏడాదిలో మరిన్ని సరికొత్త ఫీచర్లు తీసుకురాబోతున్న విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఓ కొత్త అంశం తెర మీదకు వచ్చింది. అదేంటంటే.. వాట్సాప్ మూడో బ్లూటిక్ ఆప్షన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెగ ప్రచారం అవుతోంది. ఇప్పటికే వాట్సాప్ లో రెండు బ్లూటిక్ ఆప్షన్ లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో బ్లూటిక్ కూడా తీసుకురానుందనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
ప్రస్తుతం వాట్సాప్ లో మనం ఎవరికైనా మెసేజ్ పంపితే.. సెండ్ అయ్యాక ఒక టిక్.. అవతలి వాళ్లకు రిసీవ్ అయి.. వాళ్లు మెసేజ్ చూస్తే.. డబుల్ బ్లూ టిక్ పడుతుంది. ఒకవేళ అవతలి వాళ్లు ప్రైవసీలో ఉంటే డబుల్ గ్రేటిక్ పడుతుంఉది. ఈ క్రమంలో వాట్సాప్ తాజాగా తీసుకువచ్చే.. మూడో బ్లూ టిక్ అనేది.. అవతలి వాళ్లు… సెండర్ పంపిన మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీస్తే.. థర్డ్ బ్లూ టిక్ వస్తుందని పలు బ్లాగ్ లు రాసుకొచ్చాయి.
అయితే వాట్సాప్ అప్ డేట్ ఫీచర్లపై పక్కగా సమాచారం ఇచ్చే అధికారిక బ్లాగ్ బేటాఇన్ఫో ఈ కథనాల్ని ఫేక్ గా తేల్చేసింది. మూడో బ్లూ టిక్ ఆప్షన్ తేవట్లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి మెకానిజం కోసం ఓనర్ కంపెనీ మెటా ఎలాంటి ప్రయత్నం చేయట్లేదని స్పష్టత ఇచ్చింది.