దేశంలోనే కాదూ.. ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాను తీస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీలోని ఎన్నో కంపెనీలకు అధినేతగా.. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ.. ముందుకు దూసుకెళుతున్నారు.
దేశంలోనే కాదూ.. ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాను తీస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీలోని ఎన్నో కంపెనీలకు బాస్ గా.. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ.. ముందుకు దూసుకెళుతున్నారు. చేతికి వచ్చిన పిల్లులు కూడా ఆయా కంపెనీల బాధ్యతలను చేపట్టి.. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఒక్క ముఖేష్ అంబానీ ఆస్తుల నికర విలువ రూ. రూ.7,35,000 కోట్లు. సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి అన్నట్లు.. ఇన్ని కోట్లున్నా..రుణం కోసం ఆయన సంస్థ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది.
ఎందుకు రుణాలకు వెళుతున్నారని, ఇదెక్కడీ చోద్యమని ఆలోచిస్తున్నారా..? అంత బుర్ర పాడు చేసుకోకండి. తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవడానికి సదరు సంస్థ బ్యాంకులను అప్రోచ్ అవుతుంది. అయితే ఇక్కడ బ్యాంకులను కాకుండా విదేశీ వాణిజ్య రుణ మార్గాన్ని వినియోగించుకోవాలని యోచిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులతో సంప్రదింపులు జరిగాయని సమాచారం. బ్లూమ్బెర్గ్ నివేదక ప్రకారం.. ఇలా తీసుకున్న రుణాన్ని మూలధన వ్యయం కోసం, ఇతర రుణాలను రీఫైనాన్స్ చేయడానికి రిలయన్స్ కంపెనీ ఖర్చుచేయనున్నట్లు తెలుస్తోంది.
ముఖేష్ అంబానీ సంస్థకు రుణం కోసం బ్యాంక్ ఆఫ్ అమెరికా, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సిటీ గ్రూప్ లు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జియో,రిటైల్ సంస్థలను ప్రారంభి.. విజయవంతంగా ముందుకు దూసుకెళుతున్నారు. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్కు ముడి చమురు శుద్ధి ప్రధాన వ్యాపారం. అయితే ఇండస్ట్రీకి ఎలాంటి రుణాలు లేవని గతంలో కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు రుణాల కోసం వెళుతుండటం గమనార్హం. అయితే టెలికాం, రిటైల్ రంగాల విస్తరణ నిమిత్తం నిధులను సమీకరిస్తున్నారు. రిలయన్స్ కొత్త ఇంధన వ్యాపారంలో రాబోయే 15 సంవత్సరాలలో 75 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.