మనం డబ్బు కోసం జాబ్ చేస్తుంటాము. అలా నెల మొత్తం కష్ట పడితే మనకు ఎంత వస్తుంది ఎక్కువ మందికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వస్తాయి. కొందరికి మహా అయితే ఇంకొంచెం ఎక్కువ వస్తాయి. అలాంటిది కేవలం 20 రోజుల్లోనే లక్షల్లో లాభం వస్తుందంటే అది మాములు విషయం కాదు. అది ఎలా సాధ్యమనుకుంటున్నారా! ఇలాంటివి స్టాక్ మార్కెట్లోనే జరుగుతుంటాయి. మరి అంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ లాభం ఎలా అనే విషయం తెలియాలంటే ఇది చదవండి.
షేర్ మార్కెట్లో కేవలం లాభాలు మాత్రమే కాదు..భారీ నష్టాలు కూడా ఉంటాయని మనకు తెలుసు. అందుకే ఈక్విటీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్ గురించి అనుభవం ఉన్న వారి సలహాలు, సూచనలు పాటిస్తూ, మనం కూడా మార్కెట్ ను గమనిస్తుండాలి. లేదంటే అసలుకే ముప్పు వస్తుంది. పెట్టిన డబ్బులు వెనక్కి కూడా రాకపోవచ్చు. స్టాక్ మార్కెట్ లో చాలా రకాల షేర్లు ఉంటాయి. వీటిల్లో మల్టీ బ్యాగర్ అనే స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటిల్లో పెట్టుబడులు పెట్టిన వారికి భారీ లాభం వచ్చి ఉంటుంది. ఇలాంటి షేర్లలో ఒకటైనా షేరే ఏకే స్పింటెక్స్.
ఈ షేరు పెట్టుబడి దారులకు లాభాల పంట పండించింది. అతి తక్కువ కాలంలోనే భారీ లాభాలు చూపించింది. స్టాక్ మార్కెట్ లో ఈ షేర్ కేవలం 21 ట్రేడింగ్ సెషన్లలోనే లాభాల వైపు పరుగులు తీసింది. 240 శాతం మేర ర్యాలీ చేసింది. దీంతో ఈ షేర్లు కొనుగోలు చేసిన వారికి కళ్లుచెదిరే రాబడి వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ నిపుణుల ప్రకారం లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఏకంగా రూ.3.35 లక్షల వరకు వచ్చి ఉంటుంది. అంటే తక్కువ కాలంలోనే భారీ లాభం వచ్చిందని చెప్పుకోవచ్చు.
స్టాక్ మార్కెట్ లో ఏకే స్పింటెక్స్ షేర్ గ్రోత్ చూస్తే.. 2022 జనవరి 3న రూ.33 వద్ద ఉండేది. కానీ ఫిబ్రవరి1 నాటికి దీని ధర రూ.114కు చేరింది. అంటే షేరు ధర 240 శాతం ర్యాలీ చేసింది. దీనిలో ఇన్వెస్ట్ చేసిన వారి పంట పండింది. గత ఆరు నెలల కాలంలో చూస్తే షేరు ధర రూ.22 నుంచి రూ.114కు చేరింది. అంటే షేరు ధర 416 శాతం దూసుకుపోయింది. అంటే ఆరు నెలల కిందట ఈ షేరులో రూ. లక్ష పెట్టి ఉంటే.. ఇప్పడు రూ. 5 లక్షలు అయ్యేవి. లాభాలు వచ్చినప్పటికి స్టాక్ మార్కెట్ విషయంలో జాగ్రత్త వహించాలి. లేకుంటే భారీ లాభాలతో పాటు భారీ నష్టాలను కూడా చవిచూడాల్సి వస్తుంది. మరి ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.