దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని బ్యాంకులు ఖాతాదారుల సొమ్మును ఇష్టారాజ్యంగా రుణాల రూపంలో మంజూరు చేస్తూ.. వాటిని సకాలంలో వసూలు చేయలేక దివాళ అంచుకు చేరుకుంటున్నాయి. తాజాగా దేశంలో మొండి బాకాయిల కారణంగా మరో ఐదు బ్యాంకులు దివాళ అంచుకు చేరుకున్నాయి. వాటిపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆ వివరాలు..
మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక బ్యాంకులు సేవలందిస్తున్నాయి. ఖాతాదారులు సొమ్మును భద్రంగా కాపడటమే కాక.. అవసరమున్న వారికి.. వారి వారి అర్హతలను బట్టి అనేక రకాల రుణాలు మంజూరు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ రుణాలు వసూలు చేయడంలో విఫలం అవుతతాయి. దాంతో మొండి బకాయిలు పెరుగుతాయి. ప్రస్తుతం దేశంలో కొన్ని బ్యాంకుల్లో ఈ మొండి బకాయిలు పెరిగిపోయి.. పరిస్థితి దారుణంగా మారింది.. రోజు వారి బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించడానికి కూడా సరిపడా నిధులు లేక.. ఇబ్బంది పడుతున్నాయి. చివరకు దివాళా తీస్తున్నాయి. అయితే ఇలాంటి బ్యాంక్లపై ఓ కన్ను వేసి ఉంచి కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ).. సకాలంలో స్పందించి.. ఖాతాదారులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటుంది. దివాళా తీసిన బ్యాంకుల లైసెన్స్లు రద్దు చేస్తూ ఉంటుంది.
ఇప్పటికే మధ్యప్రదేశ్లోని గర్హా ప్రాంతానికి చెందిన ఓ కో-ఆపరేటివ్ బ్యాంకు దివాలా తీయడంతో దాని లైసెన్సును రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో 5 బ్యాంకులపై ఆంక్షలు విధించింది ఆర్బీఐ. దివాలా అంచున ఉన్న 5 కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించి నగదు విత్ డ్రాలు, డిపాజిట్లపై ఆంక్షలు విధించింది ఆర్బీఐ. ఈ ఆంక్షలు ఫిబ్రవరి 24 నుంచి అనగా శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి.
దివాళా అంచున ఉన్న ఈ ఐదు బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. వీటిలో మూడింటి మీద పాక్షిక ఆంక్షలు విధించగా.. మరో 2 బ్యాంకుల మీద పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో ఈ ఐదు బ్యాంక్లు.. ఆర్బీఐ ఆమోదం లేకుండా కొత్త డిపాజిట్లను తీసుకోవడం, రుణాలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. ఈ ఐదింటిలో మూడు బ్యాంకులకు సంబంధించి నగదు ఉపసంహరణపై పాక్షిక ఆంక్షలు విధించగా.. రెండింటిపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించింది. ఆంక్షల నేపథ్యంలో ఆయా బ్యాంకుల డిపాజిటర్లు కంగారు పడాల్సిన అవసరం లేదని.. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
ఆంక్షలు విధించిన బ్యాంక్లకు చెందిన డిపాజిటర్లకు ఆర్బీఐ భరోసా కల్పించింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అర్హులైన డిపాజిటర్లు.. రూ.5 లక్షల వరకు పొందే సౌకర్యం కల్పిస్తోంది. అయితే, అది డిపాజిటర్లపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. అంతేకాక ప్రస్తుతానికి ఈ ఐదు బ్యాంకులపై కేవలం ఆంక్షలు మాత్రమే విధించామని.. ఇంకా లైసెన్స్ రద్దు చేయలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ బ్యాంకులు ఆర్థిక పరిస్థితి మెరుగు పడే వరకు ఆంక్షల మధ్య బ్యాంకింగ్ బిజినెస్ కొనసాగించుకోవచ్చు అని ఆర్బీఐ తెలిపింది. కేంద్ర బ్యాంక్ నిర్ణయంతో డిపాజిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బులు వస్తాయా రావా అని కంగారు పడుతున్నారు. బ్యాంకులు ఇలా దివాళ తీయడానికి ప్రధాన కారణాలు ఏంటని మీరు భావిస్తున్నారు.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.