బ్యాంక్ ఖాతాలు అనేవి ఇప్పుడు దాదాపుగా అందరికీ ఉన్నాయి. అందరూ లిక్విడ్ క్యాష్తో కంటే డిజిటల్ లావాలదేవీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే బ్యాంక్ ఖాతాని ఓపెన్ చేసి మీ దారిన మీరు వాడుకుంటూ ఉండాలి అంటే అవ్వదు. అకౌంట్ ఓపెన్ చేసిన సమయంలో ఎలా అయితే డాక్యుమెంట్లు సమర్పిస్తారో తర్వాత కూడా మీ ఖాతాను అప్డేట్ చేస్తూ ఉండాలి. దానినే కేవైసీ అంటారు. అంటే Know Your Customer అనమాట. ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంక్ అకౌంట్ హోల్డర్ తమ వివరాలను అప్డేట్ చేస్తూ ఉండాలి. అలా గనుక మీరు అప్డేట్ చేయకుండా వదిలేస్తే మీ ఖాతా పనిచేయకపోవడమే.. మొత్తానికే బ్లాక్ కావడమో జరుగుతుంది.
ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారులను ఇదే విషయంపై అలర్ట్ చేస్తోంది. అంతేకాదు.. వారికి డెడ్లైన్ కూడా ప్రకటించింది. డిసెంబర్ 12లోగా గనుక కమస్టమర్లు తమ కేవైసీ వివరాలను అప్డేట్ చేయకపోతే వారి ఖాతాలు నిలిచిపోతాయంటూ హెచ్చరిస్తోంది. ఇప్పటికే కస్టమర్లకు అందుకు సంబంధించిన నోటీసులు, మెయిల్స్, మెసేజెస్ కూడా పంపినట్లు తెలిపారు. అయితే మీ కేవైసీ కోసం బ్యాంక్ ఎప్పుడూ మీకు కాల్ చేసి మీ వివరాలను అడగదు. మీరే బ్యాంకుకు వెళ్లి మీ కైవేసీ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా బ్యాకులు ఆన్లైన్ యాప్స్, నెట్ బ్యాకింగ్ ద్వారా కూడా కేవైసీ అప్డేట్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మీ కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి ఏం కావాలంటే?.. పాన్ కార్డ్ నంబర్, ఐడీ ప్రూఫ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటో, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్, ఇన్కమ్ ప్రూఫ్(సాలరీ అకౌంట్ కాని పక్షంలో) అవసరం అవుతాయి. వీటిలో వారికి కావాల్సిన వాటిని అడిగి అప్డేట్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు కేవలం పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రమే కేవైసీ అడుగుతోంది అనుకోకండి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ప్రతి బ్యాంక్ ఇలా కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఓసారి మీ బ్యాంక్ ఖాతాని పరిశీలించండి. మీ ఫోన్లో మెసేజ్లు, మెయిల్స్ కూడా చూసుకోండి. మీ బ్యాంక్ కూడా మీకు ఏమైనా నోటీసులు పంపిందేమో. ఇలా కేవైసీ అప్డేట్ చేయకపోతే మీ ఖాతా సరిగ్గా పనిచేయకపోవచ్చు లేదా మొత్తానికే బ్లాక్ కావచ్చు. కాబట్టి నిరంతరం సేవలను పొందేందుకు ఈరోజే చెక్ చేసుకోండి.