ఈ మద్య ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసేవారు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అయ్యింది. ఇందుకోసం ఆధార్ తో పాటు పాన్ కార్డు కూడా ముఖ్యంగా మారింది. అంతేకాదు ఇప్పుడు ఎక్కడ బ్యాంకు లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డు తప్పనిసరి.
నేటి కాలంలో ఆర్థిక లావాదేవీలు చేయడానికి పాన్ కార్డ్ తప్పనిసరి అయ్యింది. అయితే పాన్ కార్డు గురించిన కొన్ని ముఖ్య విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ వద్ద ఎప్పుడైనా ఒకే పాన్ కార్డు ఉండాలి.. అది దేశంలో ఎక్కడైనా పరిమినెంట్ గా పనిచేస్తుంది. కానీ కొంత మంది వద్ద రెండు పాన్ కార్డులు కూడా మెయింటేన్ చేస్తుంటారు. ఇది చట్టరిత్యా నేరం. ఒకవేళ మీ వద్ద రెండు పాన్ కార్డులు ఉంటే వెంటనే సరెండర్ చేయాలి.. లేదంటే మీరు పదివేల వరకు జరిమానా కట్టవలసి ఉంటుంది.
మనం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తే అడ్రస్ మారుతుంది.. ఈ క్రమంలో కొంత మంది పాన్ కార్డు ఉన్నా.. మరో పాన్ కార్డుకి అప్లై చేసుకుంటారు. కొన్నిసార్లు దరఖాస్తు చేసినప్పటికీ రాకపోతే మరోసారి ధరఖాస్తు చేసుకుంటారు… అప్పుడు రెండు పాన్ కార్డు నెంబర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మహిళలు పెళ్లి కాక ముందు ఒక నెంబర్, పెళ్లయ్యాక మరో నెంబర్ పొందే సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి వారు వెంటనే పాన్ కార్డు సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఒకే అస్సెసీకి రెండు రెండు వేరు నంబర్లు, లేదా కార్డులు జారీ చేసి ఉండవచ్చు. కనుక ఇలాంటి పాన్ కార్డులు ఉంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది.
ఇలా రెండు పాన్ కార్డులు ఉన్నవారు వెంటనే సమర్పించని పక్షంలో మీ బ్యాంక్ ఖాతాను కూడా స్తంభింపజేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272బి ప్రకారం 2 పాన్ కార్డులు ఉన్నవారికి పదివేల జరిమానా విధించబడుతుంది. అలాగే పాన్ కార్డు డిటెల్స్ ఆధార్ తో అనుసంధానం తప్పకుండా చేయాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. .