గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప తగ్గడం తెలియని పసిడి ధర.. రెండు మూడు రోజులుగా దిగి వస్తుంది. బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి తరుణం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి...
పెట్టుబడిగానో లేక ఆభరణంగానో పనికి వస్తుంది అనే ఉద్దేశంతో భారతీయులు బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అయితే గత కొంత కాలం నుంచి పసిడి రేటు చుక్కలను తాకుతుంది. తులం బంగారం రేటు 57 వేలకు రూపాయలకు పైగా పెరిగింది. కొన్ని రోజులుగా పెరగడం తప్ప తగ్గడం తెలియని పసిడి ధర.. కొన్ని రోజులుగా పడి పోతుంది. తాజాగా నేడు పసిడి ధర పడిపోయింది. సామాన్యులు బంగారం కొనడానికి ఇదే సరైన సమయం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. కొన్ని రోజుల క్రితం అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. మధ్యలో కొన్ని రోజులు బంగారం, వెండి ధరలు పెరిగినప్పటికీ ప్రస్తుతం దిగొస్తున్నాయి.
ఇక అంతర్జాతీయంగా నేడు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు1855 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మొన్నటి వరకు ఒక దశలో బంగారం రేటు 2000 డాలర్లకు చేరుకుంది. ఇక స్పాట్ వెండి ఔన్సుకు 22 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం వెండి రేటు 21.99 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక గతంలో ఒకానోక సమయంలో వెండి ఏకంగా 24 డాలర్ల వరకు వెళ్లింది. ఇప్పుడు మాత్రం పడిపోతోంది.
ఇక నేడు హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర 57,230 రూపాయలు ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.52,650గా ఉండగా.. 24 క్యారెట్ బంగారం ధర రూ.57,380గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ బంగారం పది గ్రాముల ధర రూ.53,350, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,200గా ఉంది. అలానే ముంబైలో 22క్యారెట్ల బంగారం ధర రూ.52,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,230గా ఉంది.
అలానే వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.700 తగ్గి.. రూ.72,000 వద్ద ట్రేడవుతోంది. అలానే ఢిల్లీలో కూడా వెండి ధర కిలోకి రూ.500 దిగి రాగా.. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,000 వద్ద కొనసాగుతోంది.