బీఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా బీఎస్ఎన్ఎల్ కు భారీ ప్యాకేజ్ ప్రకటించింది. ఈ ప్యాకేజ్ విలువ సుమారు లక్షా 64వేల కోట్లు. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ సేవలు పటిష్టం చేయడానికి ఈ నిధులు ఉపయోగించాలని కేంద్రం భావిస్తోంది.
మరోవైపు.. ప్రవేట్ టెలికాం కంపెనీలు 4జీ టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకుని.. 5జీవైపు పరుగులు పెడుతున్నాయి. అయినప్పటికీ.. బీఎస్ఎన్ఎల్ మాత్రం 4జీ వైపు కూడా ద్రుష్టి పెట్టడం లేదు. ఇప్పటికే ఎంతోమంది కస్టమర్లు 4జీ బీఎస్ఎన్ఎల్ సేవలపై అసంతృప్తితో గుడ్ బాయ్ చెప్పేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ రంగ సంస్థలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో తేలికను వదిలేసి.. ఫైబర్ పై దృష్టిపెట్టడం మరింత చర్చినీయాంశంగా మారనుంది.
ఇదీ చదవండి: BSNLలో ఉద్యోగాలు.. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!