‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. వీజే సన్నీ బిగ్ బాస్ విన్నర్ గా అవతరించిన విషయం తెలిసిందే. రన్నరప్ గా షణ్ముఖ్ జశ్వంత్ తర్వాతి స్థానంలో సింగర్ శ్రీరామచంద్ర నిలిచాడు. అయితే కొన్ని రోజుల క్రితం వరకు శ్రీరామచంద్ర టైటిల్ విన్నర్ అంటూ ప్రచారాలు బాగా జరిగాయి. చివరికి మాత్రం శ్రీరామచంద్ర మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. టైటిల్ ఫేవరెట్ గా టాక్ తెచ్చుకున్న శ్రీరామ్ మూడో ప్లేస్ కే పరిమితం కావడం ఇప్పుడు పలు అనుమానాలు, ఆలోచనలకు తావిస్తోందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నిజంగానే శ్రీరామ్ విషయంలో కుట్ర జరిగిందా? లేక స్వీయ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా? తెలుసుకుందా.
ఇది కూడా చదవండి: సన్నీ బిగ్ బాస్ 5 విన్నర్ అవ్వడానికి కారణాలు!
శ్రీరామ్ విషయంలో స్వయంకృతాపరాధాలు కూడా చాలానే ఉన్నాయి. మొదటి నుంచి అగ్రెసివ్ గా ఆడిన శ్రీరామ్ చివరి వారాల్లో అంత యాక్టివ్ గా లేడు. మరోవైపు కాళ్లకు గాయాలతో మంచానికే పరిమితం అయ్యాడు. ఆ సమయంలో సేవ చేసిన వారిపై కేకలు వేయం ప్రేక్షకులు తీసుకోలేకపోయారు. సీజన్ మొదటి నుంచి శ్రీరామ్ కొన్ని సందర్భాల్లో వార్డ్స్ లూస్ అవ్వడం చూశాం. ఏజ్ విషయంలో షణ్ముఖ్, మానస్ లను మెచ్యూరిటీ లేదు అనే వార్డ్ వాడాడు. సిరి- షణ్ముఖ్ రిలేషన్ విషయంలో బయట బ్యాడ్ టాక్ నడుస్తున్నప్పుడు ఓట్స్ ను తమవైపు మళ్లించుకోవడంలో శ్రీరామ్ టీమ్ ఫెయిల్ అయ్యింది.
ఎక్స్ హౌస్ మేట్స్ లో కేవలం హమీదా, యాంకర్ రవి మాత్రమే శ్రీరామ్ కు సపోర్ట్ చేశారు. మిత్రులు వెళ్లే సరికి శ్రీరామ్ డల్ అవ్వడం చాలా మందికి నచ్చలేదు. కుట్ర కోణం అంటే శ్రీరామ్ కు చివరి వారాల్లో తగినంత స్ర్కీన్ స్పేస్ ఇవ్వలేదనే భావన వినిపిస్తోంది. అప్పటివరకు టైటిల్ ఫేవరెట్ లిస్ట్ లో పేరున్న కంటెస్టెంట్ కు సరైన స్క్రీన్ స్పేస్ ఇవ్వకపోతే ఎలా అంటూ ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఆ విషయంలోనే శ్రీరామ్ కు ఓట్లు తగ్గాయంటూ విమర్శిస్తున్నారు. శ్రీరామ్ కూడా రన్నరప్ వరకు రాగలననే నమ్మకంతో ఉన్నాడు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. శ్రీరామచంద్ర విషయంలో కుట్ర జరిగిందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ లో షణ్ముఖ్ జశ్వంత్ ఓటమికి కారణాలు!