‘బిగ్ బాస్ 5 తెలుగు’ గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ విషయంలో బిగ్ బాస్ ను మెచ్చుకున్న వారు ఉన్నారు. విమర్శించిన వారు కూడా ఉన్నారు. ఎవరు ఏలా రియాక్ట్ అయినా బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం వారి పంధాలో వాళ్లు వెళ్తున్నారు. హీరోయిన్ మాధవీలత మాత్రం బిగ్ బాస్ కు ఇంట్లోని కంటెస్టెంట్లకు గట్టిగానే సవాళ్లు విసురుతోంది. మరోవైపు తమ అభిమాన కంటెస్టెంట్ గెలవాలంటూ ప్రచారం చేస్తోంది. సిరి- షణ్ముఖ్ ను అయితే ఒక ఆట ఆడుకుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి సింగర్ శ్రీరామ్ చేరాడు.
సింగర్ శ్రీరామ్ సింగింగ్ లో నంబర్ వన్ కానీ, బిగ్ బాస్ హౌస్ లో మాత్రం రెండో స్థానంలోనే ఉంటాడంటూ కామెంట్ చేసింది. ‘కొంతమందికి కాలిపోయిద్ది కానీ, సింగర్ శ్రీరామ్ గాయాలతో ఉన్నప్పుడు జంట పాములు సేవ చేశారా? సాయం చేసింది సన్నీ, మానస్, కాజల్. కానీ శ్రీరామ్ కు వాళ్లు శత్రువులు అయ్యారు. శ్రీరామ్ విన్నర్ అవకూడదు అనే క్వాలిటీ ఇదే. ఏరు దాటే వరకు ఓట మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అంటే ఇదేనేమో?’ అంటూ మాధవీలత శ్రీరామ్ గేమ్ తీరును ప్రశ్నించింది.
మరోవైపు సేవ చేసిన వాళ్లని శత్రువులుగా.. పట్టించికోని వారిని మిత్రులుగా సపోర్ట్ చేస్తున్నాడు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. కాజల్ ఎలిమినేట్ అయితే అది ప్రేక్షకుల కర్మ అంటూ కామెంట్ చేసింది. సన్నీ విన్నర్ కావాలంటూ కోరుకుంది. మాధవీలత వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.